|
|
Articles: My Thoughts | ఫెయిల్యూర్ టు సక్సెస్ - Site Administrator
| |
అలాగే ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో బోధిస్తున్న ఉపాధ్యాయులే ఇటు స్టేట్ సిలబస్ ని తెలుగు మాధ్యమంలో, అటు సెంట్రల్ సిలబస్ ని ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తూ దేనికీ సరైన న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంటుందన్నారు. ఆంగ్ల మాధ్యమ బోధనకు గత సంవత్సరం ఇచ్చిన 13 రోజుల శిక్షణ ఏ మాత్రం సరిపోదని ఏకగ్రీవ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడా తెలుగు వాడకుండా కేవలం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే భోదన జరగడం లేదు. ఆంగ్ల మాధ్యమ బోధనను 90 శాతం మంది విద్యార్థులు అవగాహన చేసుకోలేకపోతున్నారు. మాధ్యమం, సిలబస్ రెండూ కొత్తవి కావడంతో అసలు ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది సక్రమంగా బోధించలేక పోతున్నారు.
గత సంవత్సరం ఇచ్చిన 13 రోజుల శిక్షణ తప్ప విద్యాధికారులు అదనంగా ఎలాంటి శిక్షణ గాని, పర్యవేక్షణ గాని, సూచనలు గాని చేయటం జరగలేదు. కొద్దిచోట్ల ప్రధానోపాధ్యాయులు కొంతమేరకు తగు సూచనలు చేస్తున్నారు. ఎక్కువభాగం పాఠశాలలకు సకాలంలో పుస్తకాలు ఇవ్వడం కాని, తగినన్ని ఇవ్వడం కాని జరగడం లేదు. ఎక్కువమంది తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారు కాబట్టి, తెలుగు మాధ్యమానికి నష్టం వాటిల్లకపోవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంగ్ల భాష ఆధిపత్య ధోరణి వల్ల క్రమేపీ తెలుగు మాధ్యమం అంతరించిపోయే ప్రమాదముందని కొంత మంది హెచ్చరిస్తున్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|