|
|
Articles: TP Features | హెడ్లీ చిన్నప్పట్నించీ అంతే! - Site Administrator
| |
ఇస్లామాబాద్ వెలుపల ఒక మిలిటరీ అకాడమీలో సన్నిహిత మిత్రులుగా మారిన హెడ్లీ, రాణాలను క్రితం నెల షికాగోలో అరెస్టు చేశారు. కార్టూన్లతో ముస్లిం ప్రపంచంలో ఆగ్రహాగ్ని రగిలించిన డేనిష్ పత్రిక 'జైలాండ్స్ - పోస్టెన్'పై మిక్కీ మౌస్ ప్రాజెక్ట్ పేరుతో దాడికి కుట్ర పన్నారని వారిద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. ఆ దరిమిలా కేసు దర్యాప్తు పరిధి షిగాగో, కోపెన్ హాగన్ లను దాటిపోయింది. అల్ కైదా, లష్కర్-ఎ-తోయిబాలతో సహా ఘరానా టెర్రరిస్టు గ్రూపులతోను, పాకిస్తానీ ప్రభుత్వం, సైన్యంలోని అధికారులతో ఆ ఇద్దరికీ గల సంబంధాల గురించి అధికారులు హెడ్లీ సహకారంతోనే ఎంతో తెలుసుకోగలిగారు. క్రితం సంవత్సరం నవంబర్ లో ముంబైలో ఉగ్రవాదుల దాడులకు ముందు ఆ నగరాన్ని సందర్శించిన వారిద్దరికీ ఆ దాడుల కుట్రతో ప్రమేయం ఉండి ఉండవచ్చుననే విషయాన్ని కూడా అమెరికన్, భారతీయ దర్యాప్తు సంస్థల అధికారులు పరిశీలిస్తున్నారు.
తమ స్వస్థలాలలో లేదా వాటికి సమీపంలో దాడులు సాగించే, ఛాందసవాద ఇస్లామిక్ పాఠశాలల నుంచి వచ్చిన యువ, పేద తీవ్రవాదులకు భిన్నంగా కనిపిస్తారు హెడ్లీ (49), రాణా (48). వారు సంపన్న కుటుంబాలకు చెందినవారు... విస్తృతంగా పర్యటించినవారు. వారిని 2001 సెప్టెంబర్ 11 నాటి దాడులకు ప్రధాన సూత్రధారునిగా చెప్పుకున్న, అమెరికాలో కాలేజీలో చదువుకున్న ఖాలిద్ షేక్ మహమ్మద్ తోను, ప్రధాన హైజాకర్లలో ఒకడైన మహమ్మద్ ఆట్టాతోను పోల్చవచ్చు. రాణా తండ్రి లాహోర్ వెలుపల గల ఒక హైస్కూల్ కు మాజీ ప్రిన్సిపాల్. రాణా సోదరులలో ఒకడు పాకిస్తానీ సైనిక దళంలో సైకియాట్రిస్ట్. అతను పలు పుస్తకాలు రాశాడు. రాణా మరొక సోదరుడు కెనడా రాజకీయ దినపత్రిక 'ది హిల్ టైమ్స్'లో జర్నలిస్టు.
వైద్యుడుగా శిక్షణ పొందిన రాణా 1997లో కెనడాకు వలస వెళ్ళి కొన్ని సంవత్సరాల తరువాత పౌరసత్వం స్వీకరించాడు. అటుపిమ్మట అతను తన భార్యను, ముగ్గురు పిల్లలను షికాగోకు మార్చాడు. అతను షికాగోలో పాకిస్తానీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతం డెవన్ అవెన్యూలో ఒక ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ఇమ్మిగ్రేషన్ సేవలు కూడా అందిస్తుంది. 2002లో అతను ఒక హలాల్ కబేళాను ప్రారంభించాడు. అక్కడ ఇస్లామిక్ మత చట్టాల ప్రకారం మేకలు, గొర్రెలు, ఆవులను చంపుతారు. అతను, అతని కుటుంబం ఉత్తరం వైపు ఒక చిన్న ఇటుకల ఇంటిలో నివసిస్తుంటారు. ఆ ఇంటి కప్పుపై ఒక భారీ శాటిలైట్ డిష్ ఉంటుంది. ఇరుగుపొరుగువారు రాణాను ఎవ్వరితోనూ కలవని మనిషిగా పేర్కొన్నారు. అతను ఇతరులతో మాట్లాడడం అరుదని, అతని పిల్లలు ఆ వీధిలో ఇతర పిల్లలతో ఎన్నడూ ఆడుకోరని వారు చెప్పారు.
'అతను తన ఇస్లామ్ సంప్రదాయానికి నిబద్ధుడైనట్లుగా కనిపిస్తాడు' అని ఇలినాయిస్ రాష్ట్రంలో షికాగోకు నైరుతి దిశగా దాదాపు 65 మైళ్ళ దూరంలోని కిన్స్ మాన్ లో రాణా కబేళా బాధ్యతలు ఒకప్పుడు నిర్వహించిన విలియమ్ రొడోస్కీ చెప్పారు. 'తన వారికి మాంసం సమకూర్చేందుకు, కొంత డబ్బు ఆర్జించేందుకు వ్యాపారం చేయాలని తాను అనుకున్నట్లు అతను చెప్పాడు' అని రొడోస్కీ తెలియజేశారు. రాణా గురించి తెలిసిన, అతనితో కలసి వ్యాపారం చేసిన ఇతరులు అనేక మంది 'అతనిపై టెర్రరిజం ఆరోపణలు రావడం పట్ల దిగ్భ్రాంతి చెందాం' అని చెప్పారు. వారి అభిప్రాయాలతో రొడోస్కీ కూడా ఏకీభవించారు. 'నాకు తెలిసినంత వరకు అతను చాలా మంచివాడు. సమర్థుడైన వ్యాపారి' అని రొడోస్కీ చెప్పారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|