|
|
Articles: My Thoughts | ప్రకృతి మీద పెత్తనం - Site Administrator
| |
(దుగ్గరాజు శ్రీనివాసరావు)
ప్రకృతి ఆరాధన నుండి ప్రకృతి మీద పెత్తనం స్థాయికి ఎదిగిన మానవుడు వాస్తవంలో సాధించిందేమిటి? జీవనాన్ని సుఖమయంగా మార్చటమే ధ్యేయంగా మానవ యత్నాలు జరిగాయి. విజ్ఞానశాస్త్రం ఆ యత్నాలను మరింత వేగవంతం చేసింది. విజ్ఞానశాస్త్రం అందించిన యంత్రాలను అందిపుచ్చుకున్న దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా, యాంత్రిక జీవనానికి దగ్గరకాని దేశాలను వెనకబడిన దేశాలుగా వర్గీకరించారు. ఆ వర్గీకరణ వైపు పరుగులు మొదలు పెట్టాయి. అర్థంలేని ఆ పరుగులో తమకు కలుగుతున్న నష్టం ఏమిటో అది ఎంత దీర్ఘకాల నష్టమో వారు అర్థం చేసుకోవడం లేదు.
పాశ్చాత్య సంస్కృతి ప్రకృతి వనరులను పరిమితికి మించి దోపిడి చేసే సంస్కృతి. తమ సుఖం కోసం ప్రపంచంలోని ఏమూల ఎటువంటి ప్రకృతి వనరులన్నీ అక్కడికి చేరి ఆ వనరులను సొంతం చేసుకునే మనస్తత్వం పాశ్చాత్యులది. వారి జీవన విధానాలను శాసించే గ్రంథాలలోనే అటువంటి మూలాలున్నాయి. ప్రకృతి వనరులు కలిగిన ఆసియా, ఆఫ్రికాఖండాల మీద ఐరోపా దేశాల వలస పెత్తనం వెనకున్నది ఈ దోపిడీ ఆలోచనే.
బర్మాలో టేకు, భారతదేశంలో ఇనుపఖనిజం, ఆఫ్రికాలో ఇతర ఖనిజాలు. అన్నీ తరలించుకుపోయిన ఖ్యాతి ఐరోపా జాతీయులది. పెట్రోల్ ఇంధనంగా మారిన తర్వాత అమెరికా ఆ నవీన ఇంధనం కోసం శతృదేశాలను దోపిడీ చేయసాగింది. రుచి మరిగిన పులిలా అభివృద్ధి చెందిన దేశాలకు ఇంధన దాహం తీరనిది. ఎంత దోపిడీ చేసినా సరిపోనిది. ఆ దోపిడీ దెబ్బకు ఆయాదేశాల పర్యావరణం పూర్తిగా ధ్వంసమై కోలుకోలేని స్థితికి చేరాల్సిందే. పాశ్చాత్య సంస్కృతికి ప్రపంచమంతా ధ్వంసమైన తర్వాత నేడు తిరిగి సుస్థిర అభివృద్ధి అనే ఆలోచనను చేస్తున్నారు. ఈ ఆలోచన తామే అందించినట్లు పాశ్చాత్య దేశాలు చెప్పుకోవడమే హాస్యాస్పదం. ప్రకృతికి సమీపంగా బ్రతికే ఆసియా ఖండ దేశాలకు సుస్థిర అభివృద్ధి గురించి ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. నేటికీ ప్రజలు సుస్థిర అభివృద్ధి విధానమే పాటిస్తున్నారు. కాని అసలు చిక్కంతా పాలకులతోనే. పాలకులకు, వారికి సలహాలు ఇచ్చే అధికార యంత్రాంగానికి ఆలోచనలు చేసే తీరికగాని, సత్తాగాని లేవు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|