|
|
Articles: My Thoughts | ప్రకృతి మీద పెత్తనం - Site Administrator
| |
కుటుంబ సభ్యులందరూ కష్టపడి పనిచేసుకుంటూ తమ సమీప ప్రకృతి నుండి తగినంత ప్రతిఫలం పొందుతున్న పరిస్థితి నుండి, ఒకే ఒక కుటుంబ సభ్యుడు సంపాదనాపరుడై, మిగిలిన వారంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిలబడుతున్నారు. ఇదీ మన పారిశ్రామికీరణ సాధించిన ఆర్థిక అభివృద్ధి!
ఈ ఆర్థిక అభివృద్ధితో పోలిస్తే ఆ ప్రాంతంలో జరిగే పర్యావరణం విధ్వంసం విలువ అత్యధికం. పరిశ్రమ స్థాపనకోసం గ్రామంలో చెట్టూచేమా మాయం చేస్తారు. ఇక పరిశ్రమ పనిచేయడం మొదలు పెట్టేసరికి సమీప గ్రామాలన్నింటి మీద వ్యర్థ పదార్థాల ప్రభావం మొదలవుతుంది. వ్యర్ధ పదార్ధాల ప్రభావాన ప్రజల ఆరోగ్యం చెడుతుంది. జల కాలుష్యంతో మంచి నీటి వనరు దెబ్బతింటుంది. చివరికి మంచినీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితికి దిగజారతారు ప్రజలు. మంచినీటిని కొనుక్కునే పరిస్థితి అభివృద్ధికి సంకేతమా! లేక పర్యావరణ పతనానికి, పతనమైన జీవనస్థాయికి సంకేతమా?
చెట్టు, చేమ, తాగేనీరు కనుమరుగయ్యే అభివృద్ధి పథకాలు మాకువద్దు బాబోయ్ అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మా జీవితాలు బాగుపరచకపోతే పోనీ కనీసం వాటిని ధ్వంసం చేసే అభివృద్ధి పథకాల నమూనాలను మా మీద రుద్దకండి అని ప్రజలు వేడుకుంటున్నారు. అయినా వారి వేదన ఏలినవారికి వినపడటం లేదు. మేం అమలు చేసే అభివృద్ధి పథకాలకు అడ్డుచెప్పకు, చెప్పావో నీకు ఈ మాత్రం నిలువనీడ కూడా లేకుండా చేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. తమ కళ్ళముందు కరువవుతున్న పచ్చదనాన్ని తలచుకుంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేక బిక్కుబిక్కు మంటూ జీవితం గడుపుతున్నారు 'ఆమ్ ఆద్మీ'లు!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|