|
|
Articles: TP Features | సెల్లెత్తుకుపోతున్న చదువులు - Site Administrator
| |
'శాంతి భద్రతలకు నాంది పాఠశాలలోనే పడుతుందనేది గుర్తుంచుకోవడం మంచిది. సిల్లీ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మెస్సేజ్ లు అవాంఛిత సమస్యలకు దారి తీయగలవు. డిపిఎస్ - ఎంఎంఎస్ కుంభకోణం మనందరికీ ఎరుకే కదా! మనమంతా పాఠశాలల్లో సెల్ ఫోన్లు లేకుండానే పెరిగి పెద్దవారం అయినవారమే కదా!' అని డాక్టర్ మండల్ పేర్కొన్నారు.
గుర్గాఁవ్ లో డిఎవి పబ్లిక్ స్కూల్ టీచర్ శర్మిళా ఛటర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'మా పాఠశాలలో సెల్ ఫోన్లను ఇదివరకే నిషేధించాం. చివరకు పెద్ద క్లాసులలో 16 ఏళ్ళు దాటిన పిల్లలను కూడా మొబైల్ ఫోన్లను తీసుకురానివ్వడం లేదు' అని తెలియజేశారు. 'పిల్లలు చదువుపై కన్నా ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, జోకులు మొదలైనవి సెల్ ఫోన్లపై పంపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వారు రోజంతా మొబైల్ సెట్లతో ఆడుకుంటుంటారు. అయినా తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్ ఫోన్లను దుర్వినియోగపరచకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలలో మేము తల్లిదండ్రులకు తమ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వవద్దని తరచు సలహా ఇస్తూనే ఉంటాం' అని శర్మిళ చెప్పారు.
అయితే, సెల్ ఫోన్లను నిషేధించాలనే ప్రతిపాదన పట్ల ఢిల్లీ మయూర్ విహార్ సెయింట్ మేరీస్ స్కూల్ విద్యార్థి 14 ఏళ్ళ విశాల్ అసంతుష్టి వ్యక్తం చేస్తున్నాడు. 'వద్దు. మొబైల్ ఫోన్లను నిషేధించరాదు. మా స్నేహితుల మధ్య ప్రతిష్ఠకు అవి చిహ్నాలు. సెల్ ఫోన్ ఎంత అప్ డేట్ గా ఉంటే ప్రతిష్ఠ అంత ఎక్కువగా ఉంటుంది' అని విశాల్ అనడం గమనార్హం.
ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్న ఐటి ప్రొఫెషనల్ చరణ్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, 'కర్నాటక ప్రభుత్వం ఒకసారి సెల్ ఫోన్ ను నిషేధించాలని నిర్ణయించింది. అది స్వాగతించదగిన చర్యే. ప్రతి రాష్ట్రం అదే పంథాను అనుసరిస్తాయని మా ఆశ. ప్రస్తుతం విద్యార్థులకు సెల్ ఫోన్ల వాడకం ఒక దురలవాటుగా మారిపోయింది' అని అన్నారు.
'పిల్లలకు సెల్ ఫోన్ సమకూర్చడం వారిని సామాజికంగా, భావోద్వేగపరంగా దూరం చేయడమే అవుతుందని సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ పేర్కొన్నారు. ఇక పాఠశాలల్లో సెల్ ఫోన్లు ఒక న్యూసెన్సే. విద్యార్థులు తరగతిలో ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్లను ఉపయోగిస్తూన్నారు. ముఖ్యమైన పాఠాలను వారు కోల్పోతున్నారు. స్కూలుకు హాజరు కావడానికి ప్రధాన లక్ష్యం పాఠాలు వినడమే కదా. బడి పిల్లలు సెల్ ఫోన్లు ఉపయోగించడాన్ని నిషేధించాలి. ఎందుకంటే ఈ ఫోన్ల వాడకం వల్ల వారు సంఘ వ్యతిరేకులుగా తయారవుతారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్య తీసుకోవాలి' అని అన్నారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|