|
|
Articles: TP Features | సెల్లెత్తుకుపోతున్న చదువులు - Site Administrator
| |
(రమేష్ ఆర్.)
పాఠశాలలు, కళాశాలలలో సెల్ ఫోన్లను నిషేధించాలా? దేశంలో వివిధ వర్గాలవారు అవుననే సమాధానం ఇస్తున్నారు. పిల్లల ప్రవర్తనను, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే వీటిని నిషేధించవలసిందేనని వారంటున్నారు.
'అటువంటి చర్య స్వాగతించదగినదే. ఎందుకంటే సెల్ ఫోన్ వాడకం వల్ల శాంతి భద్రతల సమస్య పెరుగుతోంది. పిల్లలు ఇటు సామాజికంగాను, అటు భావోద్వేగ పరంగాను దూరం అవుతున్నారు' అని కోల్ కతాలోని ఒక పాఠశాల టీచర్ శుభమితా చక్రవర్తి అభిప్రాయం వెలిబుచ్చారు. 'సెల్ ఫోన్ దగ్గర ఉంచుకునే విద్యార్థి పాఠాలపై అంతగా ఆసక్తి చూపడు. చదువుపై కన్నా అందరితో కలివిడిగా ఉండడంపైనే ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంటాడు. నేను బ్లాక్ బోర్డుపై రాస్తున్నప్పుడు విద్యార్థులు తమ ఫోన్లతో ఆడుకుంటున్నట్లు, లేదా టెక్స్ట్ మెస్సేజ్ పంపుతున్నట్లు చాలాసార్లు గమనించాను. ఈ విద్యార్థులలో గణనీయ సంఖ్యలో తప్పుతారని, ఇంకా చాలా మంది స్కూలు చదువు మానివేస్తారని నా భావన' అని శుభమితా చక్రవర్తి చెప్పారు.
'క్లాసురూములో ఇతర అంశాలపై, ముఖ్యంగా సెల్ ఫోన్లపై దృష్టి కేంద్రీకరించడమే విద్యార్థులు తప్పడానికి ప్రధాన కారణంగా భావించాలి. అత్యవసర పరిస్థితులలో తమ పిల్లలతో మాట్లాడడానికి వీలు కల్పించే సాధనంగా సెల్ ఫోన్ ను తల్లిదండ్రులు భావిస్తుంటారు. చాలా కేసులలో ఆసుపత్రిని లేదా పోలీసులను సంప్రదించడం మరింత ఆవశ్యకం కావచ్చు. అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడడానికి సదా స్కూల్ మెయిన్ ఆఫీసు ద్వారా ప్రయత్నించవచ్చు. కాగా, సెల్ ఫోన్లు టీనేజర్లకు హోదా చిహ్నాలుగా మారిపోయాయి. ఎందుకంటే వారి ఫోన్ మోగుతున్నప్పుడు టీచర్ పాఠం చెబుతుండగా ప్రతి ఒక్కరూ నవ్వుతుంటారు కదా! తమ సెల్ ఫోన్ లో వీడియో గేములు ఆడుతుంటే తమ మనస్సు ప్రశాంతంగా ఉంటుందని వారు భావిస్తుంటారు' అని శుభమిత పేర్కొన్నారు.
పిల్లలు సెల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉండడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కూడా కావచ్చు కనుక అన్ని రాష్ట్రాలలో విద్యా సంస్థలలో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలి.
కోల్ కతా విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం మాజీ అధిపతి, మాజీ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ మాజీ డీన్ డాక్టర్ జగదీంద్ర మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'తల్లిదండ్రులతో సంబంధాలు కలిగి ఉండడం వంటి సాధారణ అవసరాలకు విద్యార్థులు ఉపయోగించినట్లయితే మొబైల్ ఫోన్ ప్రయోజనకరంగా ఉంటుంది. కాని ఈనాటి ప్రపంచంలో మొబైల్ ఫోన్లు ఎంఎంఎస్, ఎస్ఎంఎస్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. పరిణత మనస్కులు కాని విద్యార్థులు వాటిని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ల అలవాటును తప్పించుకోలేని విద్యార్థులు ఎంతో మంది సలహాల కోసం నా వద్దకు వస్తుంటారు' అని తెలియజేశారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|