|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
'తరతరాలుగా యుద్ధ విద్యలలో ప్రావీణ్యంగల జాతులు, సిక్కు, మరాఠా, గూర్కా, రాజపుత్ వగైరా రెజిమెంట్ లను సైన్యంలో ఏర్పరచినట్లే మన వృక్ష, జంతు, మానవ సర్వేక్షణ విభాగాలలో గిరిజనుల వైజ్ఞానిక బృందాలను ఏర్పాటు చేయాలి' నా సిద్ధాంత గ్రంధంలో ఈ ముగింపు వాక్యాలను విశదీకరిస్తూ, స్వచ్ఛంద సంస్థలలో చేరిన తొలినాళ్ళలో (1984) ఒక ప్రణాళిక తయారు చేశాను కాని దానికి నిధులు ఇచ్చేవారు దొరకలేదు. క్రమంగా గిరిజనుల హక్కుల పోరాటంలో లీనమైపోయాను.
సంతలలో మోసాలు తగ్గించేందుకు పెట్టిన 'చెకింగ్ కాటాలు' ప్రసిద్ధి పొందాయి. నిబంధనలను తెలుసుకొని విచ్చలవిడిగా అడవి నరకడం అరికట్టడంతో ప్రారంభమైన ప్రయత్నం, కలప వర్తకుల పవర్ అటార్నీల రద్దు, ఎర్రమట్టి క్వారీలు మూయించడంతో పరాకాష్ఠకు చేరింది. దగాపడ్డ మహిళలు స్థానిక న్యాయస్థానాలలో తమంత తామే వాదించుకోగల ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. సర్వే నెంబర్లు, దస్తావేజులలో లొసుగులు కనిపెట్టి అధికారులను, భూస్వాములను నిలదీసే స్థాయికి గిరిజనులు ఎదిగారు. తమ సాంప్రదాయక ఆయుధాలతో తిరగబడే ధైర్యం తెచ్చుకున్నారు. రెవెన్యూ, ఫారెస్టు, పోలీస్ బలగాల పొగరుమోతు తనానికి కళ్ళెం వేయసాగారు.
కాని దేశమంతటా స్వచ్ఛంద సంస్థల ప్రాధాన్యతలు భూసంస్కరణలనుండి ఆహారభద్రత, ఉపాధి హక్కులు, కులవర్ణ వివక్ష దిశగా మారిపోయాయి. పర్యావరణం చైతన్యం పుస్తకాల ప్రచురణ, ప్రచారాలతో నేలవిడిచిన సాముగా మారింది. వర్గచైతన్యం క్రమంగా స్త్రీల, వికలాంగుల, పిల్లల హక్కులు, రిజర్వేషన్లు సాధనవైపు మళ్ళింది. పౌరహక్కుల సంస్థలు, విప్లవసంఘాలు, హింస ప్రతిహింసల వివాదాలలో చిక్కుకుని ఆత్మరక్షణలో పడిపోయినాయి. ఆయా ప్రాంతాలకే మా ఉద్యమాలు పరిమితమైనప్పటికీ, అవి సాధించిన ఉత్తర్వులు రాష్ట్రం, దేశ మంతటికీ వర్తించాయి. ఏ ఉత్తర్వులైనా కొంతవరకు అమలు జరగాలంటే ఎక్కడికక్కడ ప్రజలను సన్నద్ధం చేయాలి. మంత్రాలకు చింతకాయలు రాలవు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|