|
|
Articles: Devotion | ఏక్ నాధ్ జ్ఞానబోధ - Mrs. Kanaka Durga
| |
'నాయనా! నేను క్షమించల్సినంత తప్పు పని నువ్వేం చేసావు? నిజానికి నేనే నీకు ఎంతో ఋణపడి వున్నాను. మాతృ సమానురాలైన గోదావరి నదిలో ఒక్కసారి స్నానమాచరించినంతనే వేల జన్మల పాపాలు పటా పంచలు అయిపోతాయి. అటువంటిది నేను నీ దయ వలన ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా నూట ఎనిమిది సార్లు స్నానం చెసి అమితమైన పుణ్యం మూట కట్టుకున్నాను. ఈ రోజుతో నా జన్మ ధన్యమయ్యింది. అయితే నా సాధనకు , తపస్సుకు భంగం కలిగించినందున నీకు మేలు జరిగితే మొదటిసారే నేను నా అనుష్టానన్ని విరమించుకునేవాడిని. నీకు నూట ఏడు సార్లు నాపై ఉమ్మి వేసే కష్టం కలిగించే వాడినే కాదు. సత్యం, ధర్మం, దయ, జాలి, ఓర్పు, సహనం, దానం, మృదు భాషణం వంటి సద్గుణాలను అలవర్చుకొని సన్మార్గం లో జీవిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి తప్పక పాత్రుడవౌతావు. ధనం కోసం నమ్మిన సిద్ధాంతాలను, నైతిక విలువలను ఏనాడు విసర్జించవద్దు' అని మృదు మధురంగా పలికారు మహా తపస్వి, బ్రహ్మ జ్ఞాని అయిన సంత్ ఏకనాధులు.
ఆయన అమృత తుల్యమైన పలుకులు ఆ కిరాతకుని హృదయంలో అజ్ఞానంధకారములను పటా పంచలు చేసి జ్ఞాన జ్యోతులను వెలిగించాయి. ఆ స్వామికి సాష్టాంగ నమస్కారం చెసి వెళ్ళిపోయాడు.
ఏకనాధ మహర్షి చేసిన ఈ అద్భుతమైన, అసామాన్యమైన ఉపదేశం మనందరికీ శిరోధార్యం, సదా అనుసరణీయం!
సర్వే జనా సుఖినోభవంతు
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|