|
|
Articles: Devotion | ఏక్ నాధ్ జ్ఞానబోధ - Mrs. Kanaka Durga
| |
మహరాష్ట్ర లో 16 వ శతాబ్దం లో (1533-1599) అవతరించి లక్షలాది మందిని ఆధ్యాత్మిక మార్గం లో నడిపించి ధర్మ సంస్థాపన గావించిన ఏకనాధుని జీవితం లో జరిగిన ఒక అపురూప సంఘటనను ఇప్పుడు స్మరించుకుందాం. తద్వారా ఆ మహనీయుని దివ్య ఆశ్శీసులకు, అనుగ్రహానికి పాత్రులౌదాం.
అరిష్డ్వర్గములను అతి చిన్న వయస్సులోనే లోబర్చుకున్న ఏకనాధుడు సహనానికి ప్రతీక. అధ్యాత్మిక బోధనలు చేసే సందర్భంలో నాస్తికులు, ఇతర మతస్థులు అతనిని చుట్టు ముట్టి ఎంతగా విసిగించినా, దుర్భాషలాడినా ఏ మాత్రం సహనం కోల్పోయేవాడు కాదు. చెక్కు చెదరని చిరునవ్వే అన్నింటికీ సమాధానంగా వుండేది.
ఒక సందర్భంలో నాస్తికులందరూ ఒక చోట సమావేసమై ఏకనాధునికి తపోభంగం కలిగించి అతనిలో అశాంతినీ, అలజడులను లేపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఒక కిరాతకునికి కొంత ధనం అప్పజెప్పి ఏకనాధుని మీదకు అతనిని వదిలారు.
ఏకనాధుడు ప్రతీ ఉదయం గోదావరి నదికి వెళ్ళీ స్నానం చేసి, గాయత్రి మంత జపం, సంధ్యా వందనములను ఆచరించి తిరిగి తన ఇంటికి వచ్చేవాడు. అప్పటి వరకు పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. పాండు రంగ విఠలుని అక్కలంక భక్తుడైన ఏకనాధునికి ఆ స్వామి దర్శనం తరచుగా లభించేదని అందరూ చెప్పుకునేవారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|