|
|
Articles: TP Features | సంక్షోభానికి కారణం ఎవరు? - Site Administrator
| |
ఆంధ్ర నాయకులు తేరుకొని చూసేపాటికి తెలంగాణా అనివార్యం అని తేలిపోయింది. పార్టీ భేదాలు లేకుండా, ఎవరికి వారు తమ తమ అధిష్టానాన్ని తప్పుపడ్డటం ప్రారంభించారు. కాంగ్రెస్ వారు, టిడిపి, ప్రజారాజ్యం పార్టీ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా క్షేత్రస్థాయి నిజం గుర్తుకొచ్చింది. తమ నియోజకవర్గ ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకోకుండా, విభజన వల్ల లాభ నష్టాలు చర్చించకుండా, అధిష్టానానికి తమ నిర్ణయాన్ని వదిలివేయడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమయిందని ఈ నాటికీ గ్రహించలేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక రకంగా సిగ్గుపడవలసిన విషయం.
అమెరికాలో ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం కావో తెలుసుకుంటే, ఇకనైనా ప్రజల అభీష్టానికి, అభిప్రాయానికీ ఒక విలువ వచ్చే అవకాశం ఉంది. అయితే, మన సమస్యకు, అమెరికాకి సారూప్యమేమిటని ప్రశ్నించవచ్చు. కాని మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గాని, ఫెడరల్ వ్యవస్థ గాని, అసలు ప్రజాస్వామ్యం అనే భావన గాని అమెరికా రాజ్యాంగంలోంచి మనం అరువు తెచ్చుకున్నవే అన్న విషయం గమనించాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనం ఇంకా పరిణితి చెందుతున్నాం. అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ పరిణామాలు మన దేశంలో మరో ఏభై ఏళ్ళకు జరగవచ్చు. కానీ మనం అమెరికా రాజకీయ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయో ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అమెరికాలో ఒబామా సూచించిన హెల్త్ కేర్ బిల్ విషయానికి వస్తే, ఇక్కడ జరుగుతున్న రాజకీయ ప్రక్రియ చూస్తే, ఇంకా మనం ఎంత పరిణితి చెందాలి అన్న విషయం తెలుస్తుంది. ఒక ప్రజా సమస్యను ఏ విధంగా డీల్ చెయ్యాలి అనే విషయం మన రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. మన ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ దేశాలలో పరిపాలన ఎలానో అభ్యాసం చేయడానికి ప్రజా ధనంతో విదేశీ ప్రయాణాలు చేస్తారు. అటువంటి ప్రయాణాలలో కనీసం ఉద్దేశ్యాలను నెరవేర్చినా ఈ రోజు ఈ సంక్షోభం ఎదురయ్యేది కాదు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|