|
|
Articles: My Thoughts | చారిత్రక క్షణాలు - Site Administrator
| |
వారు ప్రత్యేక ప్రయత్నంచేసి ఆంధ్రుల ముందు తమ యాసను కూడా వదలిపెట్టి 'చెప్పండి, వచ్చారు' వంటి పదాలు ఉపయోగిస్తూ, వారు వెళ్ళిపోగానే 'చెప్పే, వచ్చిండు' వంటి పదాలను తమ యాసలో వాడుతుంటారు. కేవలం ఇతరులను మెప్పించేందుకు తమ సొంత యాసను సవరించుకునే ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదు... అదే తెలంగాణ ప్రజల గొప్పతనం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారికి హైదరాబాద్ చాలా త్వరగా స్వస్థలంగా మారిపోయినందున సమైక్య ఆంధ్ర ఉద్యమం బలం పుంజుకుంటున్నది. ప్రాంతాల వేర్పాటు కోసం ర్యాలీలు జరగడం చూశాం. కాని 'నిరసన ప్రదర్శనలు' రెండు ప్రాంతాలను సంఘటితం చేయడం చరిత్రలోనే కనిపించదు. అదే ఆంధ్ర ప్రదేశ్ గొప్పతనం. వైజాగ్, విజయవాడలలో విద్యార్థుల తీరును పరిశీలిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే వారి ప్రయత్నమని నిర్థారణ అవుతుంది.
ఇక హైదరాబాద్ ను 'రెండు ప్రాంతాలకు రాజధాని'గా చేయాలని 'కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)'గా చేయాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. హైదరాబాద్ ను రెండు ప్రాంతాలకు రాజధానిగా చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే, హైదరాబాద్ భౌగోళిక స్వరూపాన్ని పేర్కొంటూ కెసిఆర్ అభ్యంతరం లేవదీయవచ్చు. దీనికి చండీగఢ్ తో పోలిక తీసుకురాకూడదని ఆయన అంటున్నారు. పంజాబ్, హర్యానా రెండింటికీ మధ్యలో చండీగఢ్ ఉందని ఆయన పేర్కొంటున్నారు. హయత్ నగర్ నుంచి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న కోదాడ వరకు రహదారి పొడవుగా 20 కిలోమీటర్ల ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ కు పొడిగింపుగా ప్రకటించి, కోదాడ సమీపంలో ఆంధ్ర కోసం కొత్త రాజధానిని నిర్మించాలి.
ఆంధ్ర కోసం కొత్త రాజధానిలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి. వెనుకబడిన ప్రాంతమైన నల్లగొండ కూడా దీనివల్ల అభివృద్ధి చెందగలదు. ఇక హైదరాబాద్ రెండు ప్రాంతాలకు రాజధానిగా ఉంటూ ఇంతకు ముందు వలె తెలుగువారందరికీ ఉపయోగపడుతుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|