|
|
Articles: TP Features | బౌద్ధం మానసిక ఔషధం - Site Administrator
| |
(డాక్టర్ కత్తి పద్మారావు)
బౌద్ధం భారతదేశంలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. అనేక దేశాల్లో మొదటి మతంగా చాలా దేశాల్లో రెండు, మూడు స్థానాల్లో ఉంది. ఆయా సంస్కృతుల్లో మిళితమైన బౌద్ధం తన వ్యక్తిత్వాన్ని చాటుతూనే ఉంది. ప్రపంచంలో బౌద్ధం విస్తరించకపోతే హింసాత్మకమైన ప్రవృత్తే మానవ నైజంగా మారిపోయేది. హింస చేసినవాడే నాయకుడిగా, హింసాకాండతో ముందుకు సాగినవాడే విజేతగా ప్రశంసలు పొందేవాడు. బౌద్ధం మనిషిని గుర్తించింది. అతనిలో నిక్షిప్తమైన కరుణను ఉద్దీపనం చేసింది. మానవ శిల్పంలో అదుపులో ఉంచాల్సినవేవి, ఉత్సాహపరచాల్సినవేవో అధ్యనం చేసింది. ఆ మార్గాన్ని చూపించింది. ఈ సిద్ధాంతకర్త బుద్ధుడు మానవుడే. మానవత్వాన్ని గుర్తించినవాడు. మానవ దర్శనానికి ఆయువు పోసినవాడు.
బౌద్ధం ఔక మార్గమే గాక అది తత్వశాస్త్రం. తత్వశాస్త్రానికి మౌలికసూత్రం మనిషికి మరో మనిషికి, మనిషికి - సంఘానికి, మనిషికి - ప్రకృతికి ఉండే అంతస్సంబధాలను పెంచుకోవడమే. ఈ అంశాలన్నిటి పట్ల బౌద్ధం చాలా తీవ్రంగా పనిచేసింది. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే దృక్పథాన్ని రూపొందించింది. తత్వీకరించింది. మనిషిలో ఉండే అనేక రుగ్మతలకు ఔషధాలను రూపొందించింది. ఈనాడు ప్రపంచ మానవుడు బౌద్ధాన్ని తప్పక అధ్యయనం చేయాల్సి ఉంది. పాలకవర్గాలు కూడా బౌద్ధాన్ని లోతుగా చూడాలి. తమ పరిపాలనా రంగాలన్నింటికి బౌద్ధం ఈనాడు ఉపయుక్తం అవుతుంది. పరిపాలనతో నీతి, పారదర్శకత, వ్యక్తిత్వం బౌద్ధం నుండే సంక్రమిస్తాయి.
ఆధునిక బౌద్ధాన్ని అంబేడ్కర్ పునర్నిర్మించారు. భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు విముక్తి మార్గంగా దాన్ని రూపొందించారు. బౌద్ధం అనేక దేశాల్లో అనేక కాలాల్లో ఆయా కుల, దేశ పరిస్థితుల నుంచి పునర్నిర్మాణం చెందుతూ వచ్చింది. అనేక భాషల్లో దాని అంతశ్శక్తిని ప్రదర్శించింది. మళ్ళీ బౌద్ధ పునర్నిర్మాణ కర్త భారతదేశంలోనే ఆవిర్భవించడం ఒక పెద్ద పరిణామం. మానవ మస్తిష్కాన్ని శుద్ధి చేసే యంత్రంగా బౌద్ధం ఆవిర్భవించింది. మత సంస్కృతితో పాటు చరిత్ర - సంస్కృతి - వ్యక్తిత్వ నిర్మాణం మీద అంబేడ్కర్ కున్న అధ్యయనం బౌద్ధ నిర్మాణంలో కీలకపాత్ర వహించింది. భారతదేశంలో మానవుణ్ణి మానవుడిగా గుర్తించని వైదిక బ్రాహ్మణ మతానికి ప్రత్యామ్నాయంగా అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|