|
|
Articles: TP Features | బౌద్ధం మానసిక ఔషధం - Site Administrator
| |
ఈ మొత్తం సమాజాల్లో ప్రేమ అంతస్సూత్రంగా నడుస్తుంది. యుద్ధ కాంక్ష, సామ్రాజ్య నిర్మాణం, రక్తం ఏరులై పారినా దాన్ని వీరరసావిష్కరణంగా అపాదించి కొనియాడడం ఇది భారతీయ ఆదిమ జాతుల్లో ఉండేది కాదు. బౌద్ధం మనిషిని బాగా పరిశీలించింది. సామాజిక శాస్త్ర అన్వయాన్ని గావించింది. మార్క్సు కమ్యూనిజం స్థాపన కోసం చెప్పిన కార్మిక నియంతృత్వాన్ని, బలవంతంగానైనా ఈ ఉన్న వ్యవస్థను కూల్చాలనే విషయాలను అంబేడ్కర్ బౌద్ధ సూత్రాల ద్వారా ఎదిరించారు. రక్తపాతాన్ని నివారించే మార్గంలోనే అంబేడ్కర్ మార్క్సిజాన్ని విమర్శించారు. కాని మార్క్సిజంలో ఉన్న సమసమాజ భావనకు అంబేడ్కర్ వ్యతిరేకి కాదు. దాన్ని సాధించడంలోనే ఆయన బౌద్ధమార్గాన్ని తీసుకొన్నారు. జాతీయోద్యమంలో గాంధీ వంటి వారికి అంబేడ్కర్ బౌద్ధ మార్గాన్ని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాలేదు. భారత స్వాతంత్ర్యాన్ని మత ఘర్షణల్లేని పద్ధతిలో సాధిద్దామనే అంబేడ్కర్ చేసిన ప్రయత్నాన్ని, భారతీయ సమాజంలో తాత్విక భూమిక లేని నాయకులు అర్థం చేసుకోలేకపోయారు.
బుద్ధుడు దుఃఖాన్ని గుర్తించాడు. దుఃఖాన్ని నివారించడమంటే దోపిడీని నివారించడమే అని బుద్ధుడు చెప్పాడు. ఈ విషయాన్ని అంబేడ్కర్ మార్క్సు కంటే 2500 సంవత్సరాలకు ముందే మనిషి దుఃఖానికి మూలమైన అంశాలపైన అంబేడ్కర్ సమకాలికంగా చర్చించారు. దుఃఖమంటే అది మనిషి మరణించినపుడు వచ్చేదే కాదు. ఒక మనిషిని ఒక మనిషి, ఒక జాతిని ఒక జాతి పీడించినపుడు కలిగేది నిజమైన దుఃఖం. ఆ దుఃఖాన్ని నివారించడానికి సూత్రాలు రూపొందిస్తున్నపుడే అంబేడ్కర్ బౌద్ధాన్ని భారత రాజ్యాంగంలో రంగరించగలిగారు. అంబేడక్ర రాజ్యాంగ సూత్రాల్లో బౌద్ధంలో ఉన్న జీవన భద్రతను, ఆదేశిక సూత్రాల్లో చేర్చగలిగారు. అందుకే ఇప్పుడాయన రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా బౌద్ధాన్ని, అంబేడ్కర్ ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అనేక భాషా జాతులు, కులాలు నివసిస్తున్న భారత దేశంలో అంతరాలు పోవాలన్నా, సామరస్యం, సౌభ్రాతృత్వం రావాలన్నా మనం బౌద్ధాన్ని అర్థం చేసుకోవలసిందే.
మహాయాన బౌద్ధులు ప్రచారం చేస్తున్న కర్మ, పునర్జన్మ భావాలను అంబేడ్కర్ నిరాకరించారు. మనం 'కర్మ'ను అంగీకరిస్తే ఇప్పుడున్న అస్పృశ్యులందరూ ఏదో పూర్వజన్మలో చేసిన పాపం వల్ల జన్మించారని నమ్మాల్సి వస్తుంది. దాని వల్ల పుట్టుకతో సంబంధం ఉన్న ఈ కులం బలపడుతుంది. ఈ కులాన్ని బలహీనపరచాలంటే పునర్జన్మ భావాన్ని నిరాకరించాల్సి ఉంది. ఈ భావాలను బౌద్ధంలో ఆచరించనివారు, బౌద్ధానికి వ్యతిరేకులే అని అంబేడ్కర్ భావించారు. ప్రధానంగా పునర్జన్మ అనే దాన్ని అంబేడ్కర్ తోసిపుచ్చారు. మానవుడికి ఒకే జన్మ. జన్మ సార్థకత జన్మించిన ప్రతి వ్యక్తిని సమానంగా చూడటంలో ఉంది. బుద్ధుడు 'అనాత్మ' సిద్ధాంతాన్ని నిరీశ్వర సాంఖ్యవాదం నుండి తీసుకొన్నారు. అందుకు మనిషిని ప్రేమించడం అనే సహజమైన అంశానికి కట్టిన అడ్డుగోడలను బౌద్ధంలోని ప్రేమతత్వాన్ని నిరాకరించగలిగింది. అందుకే భారతీయల సమత, కేవలం ఆర్థికమైందే కాదు. అది ఆత్మీయమైనది కూడా. బౌద్ధంలో 'సత్యవాక్కు'కు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం వలన సత్యాన్ని ఔషధంగా భావించారు. బౌద్ధం 'అహం' మీద దెబ్బకొట్టింది. అహం, వీరం అన్నీ భ్రమపూరిత అంశాలుగా నెట్టివేసింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|