|
|
Articles: TP Features | తల్లికి దండకాలు అక్కర్లేదు - Site Administrator
| |
నిజంగా ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాబోయే శాసనసభలో ఈ విషయంలో బిల్లును ప్రవేశపెట్టి, చట్టంగా తేవాలి. బెయిల్ అవకాశం లేని సెక్షన్ క్రింద అరెస్టు చేసి, తగిన శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించాలి. అయితే - ప్రభుత్వాన్నే కొంతవరకు శాసించగల బలమైన వర్గంగా విలసిల్లుతున్న ఈ విద్యాసంస్థలు, అందునా మిషనరీ సంస్థలు అలాంటి చట్టాన్ని తేకుండా నిరోధించవా? వాటిని ఎదుర్కొని ముందడుగు వేయగల శక్తిని మన ప్రభుత్వం ప్రదర్శిస్తుందా?!
ఇదే సమయంలో ప్రభుత్వం తమకు తెలుగుంటే ప్రేమ ఉన్నదనీ, పట్టుదల ఉన్నదనీ తెలుగు జనాన్ని నమ్మించడం కోసం - కోపంతో ఉన్న తెలుగు ప్రజలను శాంతపరచడం కోసం ఒక తమాషా చేసింది. 'మా తెలుగుతల్లికీ మల్లెపూదండ'ను ప్రార్థనా గీతంగా ప్రతిరోజూ పాఠశాలల్లో తప్పనిసరిగా పాడాలని ఆదేశించింది. ఇంత మంచి పనిని తమాషా అని ఎందుకంటున్నామంటే - ఈ ప్రార్థనాగీతం ఇప్పుడే ఎందుకు జ్ఞాపకం వచ్చిందీ అని. తెలుగును అన్ని విధాలా నిర్లక్ష్యం చేసి పాలనలో బోధనలో తల ఎత్తకుండా అణచివేసే విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి ఏనాటి నుండో తాను పట్టించుకోకుండా ఉన్న ప్రార్థనా గీతం ఉన్నట్లుండి గుర్తుకు రావడం తమాషా కదూ! కన్నతల్లికీ తిండినీ, బట్టలనూ ఇచ్చి అన్ని విధాలుగా గౌరవంగా, ప్రేమగా చూసుకోవడం మాని, చిక్కి శల్యమై దీనంగా చూస్తున్న స్ధితిలో ఆమెకు అలంకారాలు, పూజలు చేస్తామంటే, ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తామంటే ఎవరు మెచ్చుకుంటారు?
తెలుగుజాతిలో భాషాపరమైన, సాంస్కృతిక పరపమైన అవగాహనకు, సమైక్యతకు కృషిచేయాలన్న ఆలోచనే ఇన్నేళ్ళుగా లేని ప్రభుత్వానికి ఉన్నట్లుండి ఈ శ్రద్ధ ఎందుకు వచ్చినట్లు?! భావోద్రేకాలను దువ్వడం ద్వారా పోతున్న పరువును కాపాడుకొని, పరపతి పెంచుకోవడానికి కదూ! తెలంగాణ వేర్పాటువాదుల్లో కొందరికిప్పుడు ఇదొక అంశమై కూర్చొంది. ప్రభుత్వమే వారికి ఒక ఆయుధాన్నిచ్చినట్లయింది. వారి సంగతి అలా ఉంచి, అసలు విషయాన్ని ప్రక్కకు పెట్టి బాధ్యతల్నుంచి తప్పించుకోవడం కోసం ప్రభుత్వ వర్గాలు ఇప్పుడీ తమాషా చేస్తున్నాయని భాషోద్యమకారులు కూడా గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై వత్తిడి తేవడాన్ని లక్ష్యం నేరవేరే దాకా భాషోద్యమకారులు కొనసాగించాలి. ఇదే సమయంలో తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖను సాధించే దిశగా కూడా ముఖ్యమంత్రిని ఒప్పించాలి. ప్రభుత్వానికి సంబంధించి సాధించుకోవలసిన అత్యవసర లక్ష్యాలు ఇవే. ప్రజల్లో స్వాభిమానాన్ని, భాషాచైతన్యాన్ని పెంచుతూ ఉద్యమాన్ని పటిష్టం చేస్తూనే, ఈ తక్షణ లక్ష్యాల సాధనకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|