|
|
Articles: TP Features | కొత్త శక్తి, నూతన ధైర్యం - Site Administrator
| |
భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వమనే గొప్ప సంపదను పాశ్చాత్య ప్రపంచానికి వెల్లడించి భారత సామాన్య ప్రజానీకపు భౌతిక జీవిత అభివృద్ధికి అమెరికా ప్రజల సహాయాన్ని కోరేందుకు ఆయన చికాగో వెళ్ళాడు. ప్రారంభ సమావేశం రోజున ఆయన హిందూ మత ప్రతినిధిగా వేదికను అలంకరించాడు. అప్పుడు అమెరికా, వారి మనస్సులలో హిందూ మతం అంటే ఒక మూఢ నమ్మకాల అంధకారమనే అభిప్రాయం ఉండేది. గొప్ప ఆడంబరంతో, వైభవంతో కూడిన దృశ్యం నేపథ్యంలో విదేశీ శ్రోతల ముందు నిల్చి తన సొంత భాష కాని భాషలో మాట్లాడవలసి రావడం, తన నేపథ్యమేమిటో తెలియని శ్రోతల ముందు ప్రసంగించవలసి రావటం స్వామి వివేకానందుని వంతయింది. ఆ రోజు సమావేశం ముగియబోతున్న సమయంలో ఆయన లేచి నిలబడ్డాడు. 'అమెరికాకు చెందిన సోదర సోదరీమణులారా!' అనే ఉద్వేగపూరిత సంబోధన శ్రోతలలో మహత్తరమైన ప్రతిస్పందన కలిగించింది. అప్పుడు వేలాది స్త్రీ పురుషులు ఐచ్ఛికంగా లేచి నిలబడి కొన్ని నిముషాల పాటు గట్టిగా హర్షధ్వానాలు చేశారు. ఆ కొద్ది నిముషాలలోనే వివేకానందుడు తనను తాను స్థాపించుకున్నాడు.
ఆయన చేసిన ఒకే ఒక చిన్న ఉపన్యాసం పూర్తిగా మరుగులో ఉన్న ఆయనను ప్రపంచం జయధ్వనులతో స్వాగతమిచ్చేటట్లు పైకెత్తివేసింది. అమెరికాయే కాక ఇతర యూరోపియన్ పత్రికల ద్వారా ఆయన ఉపన్యాసం బహుళంగా వ్యాప్తి చెందింంది. 'చికాగో ప్రసంగం' ఇంగ్లీషులో కేవలం 500 పదాలు గలది మాత్రమే. అనేక దేశాల శరణార్ధులకు, బాధితులకు ఆశ్రయమిచ్చి కాపాడిన దేశానికి చెందిన వాడినని ఆయన చెప్పారు. మూఢభక్తికి మరణగంట మోగిందని ఆయన ఆశాభావం వెలిబుచ్చి, కత్తితో కాని, కలంతో కాని చేసే అత్యాచారాలన్నీ సమాప్తి చెందుతాయని చెప్పారు. మూడు వేల ఏళ్ల నాటి వేదమంత్రాలను అనువదించి చదివారు. గీత నుండి కొన్ని పదాలను ఉదహరించారు. నాలుగు రోజుల తరువాత మరోసారి ఆయన పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ను ఉద్దేశించి ప్రసంగించారు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|