|
|
Articles: TP Features | కొండను తవ్వి... - Site Administrator
| |
ఇంత మంది జనాభాకి ఆతిథ్యం ఇవ్వడం సాధ్యమా! అందుకోసం అక్కడి ప్రకృతి వనరుల మీద ఎంత ఒత్తిడి ఏర్పడి ఉంటుంది? ఇంత మంది ప్రతినిధులకు సౌకర్యాలు కల్పించాలంటే ఎంత విద్యుచ్ఛక్తి అవసరమై ఉంటుంది! ఎన్ని వేల ఎయిరి కండిషనర్లు లేదా హీటర్లు ఉపయోగించి ఉంటారు! అందుకు ఎంత విద్యుత్ అవసరమై ఉంటుంది?
లక్ష మంది అతిథులకు ఆహారపు ఏర్పాట్లు చేయాలి. అందుకు అవసరమైన పదార్థాల తయారీ కష్టమైతే, ఆ పదార్థాల వాడకం తర్వాత విడుదలయ్యే చెత్తను తరలించడం మరో పెద్ద సమస్య. ఐదు లక్షల జనాభాకి ఏర్పాటు చేసిన వ్యర్థ పదార్థాల రవాణా వ్యవస్థ కొత్తగా వచ్చిన లక్ష జనాభా వదిలే వ్యర్థాలను తీసుకువెళ్ళగలిగిన సమర్థతను కలిగి ఉందా? ఆ చెత్తనంతా కోపెన్ హాగన్ ప్రజలు లేదా హాలండ్ ప్రజలు భరించి ఉండాలి కదా! ఆ చెత్తను ఎక్కడ పారవేశారు. దాని వలన ఆ దేశపు పర్యావరణానికి కలిగిన నష్టం ఎటువంటిది? ఈ అంశం మీద అధ్యయనం జరిగిందా?
కోపెన్ హాగన్ సదస్ు సందర్భంలో ఉపయోగించిన నీటి పరిమాణం ఎంత? అతిథులుగా వచ్చిన లక్ష మంది జనాభాకి నీటి సరఫరా ఎక్కడి నుంచి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా వృథా అయిన నీరు ఎంత? ఎంత మురికినీరు బయటకు వచ్చింది? ఆ నీటిని ఎక్కడకు తీసుకువెళ్ళి కలుపుకున్నారు. ఆ కాలుష్య జలాల వల్ల అక్కడి నీటిలో నివసించే జీవాలు ఏమయ్యాయి?
ఇదంతా ఒక ఎత్తు అయితే, కోపెన్ హాగన్ సదస్సుకి వెళ్ళిన అధికార, అనధికార ప్రతినిధులు చేసిన విమాన ప్రయాణాలు! ఆ ప్రయాణాల వల్ల కలిగిన కాలుష్యం సంగతి గమనించారా! అంతర్జాతీయ విమానయాన సంస్థవారి అంచనా ప్రకారం ఢిల్లీ నుంచి కోపెన్ హాగన్ కి మధ్య ఉన్న 6,117 కిలోమీటర్ల విమాన ప్రయాణంలో మొత్తం 776 కిలో గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీనిని బట్టి మొత్తం 190 దేశాల అధిపతులు, వారి బృందాలు చేసిన విమాన ప్రయాణాల వల్ల విడుదలైన అదనపు కార్బన్ డయాక్సైడ్ ఎంతో అంచనా వేయవచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|