|
|
Articles: TP Features | కొండను తవ్వి... - Site Administrator
| |
కోపెన్ హాగన్ సదస్సు లక్ష్యం భూమి తాపాన్ని పెంచుతున్న వాయువుల విడుదలను తగ్గించాలన్నది. భూమి తాపం పెంచే వాయువులలోముఖ్యమైనది కార్బన్ డయాక్సైడ్. ఏ వాయువునైతే తగ్గించాలనుకుంటున్నారో ఆ కార్బన్ డయాక్సైడ్ నే వదులుకుంటూ వందల సంఖ్యలో విమానాలు ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి, కోపెన్ హాగన్ ఆకాశాన్నంతా కార్బన్ డయాక్సైడ్ తో నింపాయి. చివరికి హరిత వాయువుల విడుదల తగ్గించేందుకు స్పష్టమైన చర్యలు ఏవైనా చేపట్టారా! అంటే అదీ లేదు. ఆ విషయంలో ఏకాభిప్రాయానికి రాకుండానే ఎవరి దారిన వారు కార్బన్ డయాక్సైడ్ వదులుతూ వెళ్ళిపోయారు. ఇదీ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చేస్తున్నది!
అంతర్జాతీయ స్థాయిలోనే కాదు, స్థానిక స్థాయిలో కూడా పర్యావరణం పరిరక్షణ గురించి మాట్లాడేవారు తమకు తెలియకుండా చేసే పర్యావరణ ధ్వంసం గురించి చెప్పనా! పర్యావరణ అంశంలో అవగాహన పెంచేందుకు రాష్ట్రప్రభుత్వ అటవీ శాఖ ఒక ఇంటర్నెట్ ఆధారిత బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎ.పి. ఎన్విరాన్ మెంట్ కనెక్ట్ అనేది ఈ బృందం. ఈ బృందంలోని సభ్యులు ఎవరైనా తమకు తెలిసిన సమాచారం మెయిల్ చేస్తే మిగిలిన వారందరికీ ఆ సమాచారం అందుతుంది. అంతవరకూ బాగానే ఉంది.
అయితే, ఒకరి నుంచి ఒక సమాచారం రాగానే అది అందుకున్న సభ్యులంతా తమ అదనపు వ్యాఖ్య జారీ చేసి మళ్ళీ అందరికీ పంపుతుంటారు. ఒక బృందం ఇరవై మంది ఉండి రోజుకు ఒక్కొక్కరు ఒక అంశం బృందంలో అందరికీ పంపితే, అది అందుకున్న ప్రతి ఒక్కరూ ఆ సమాచారానికి అదనపు సమాచారం జోడించి తిరిగి పంపింతే, ఒక రోజులో 20x20 = 400 కి తగ్గని మెయిల్స్ వెళ్ళే అవకాశం ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|