|
|
Articles: TP Features | కొండను తవ్వి... - Site Administrator
| |
(డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు)
'కొండను తవ్వి ఎలుకను పట్టడం..' అనేది సామెత. అయితే కొన్ని సందర్భాల్లో కొండను తవ్వుతారు... కానీ ఎలుకను పట్టడం జరగదు. అసలు ఎందుకు కొండను తవ్వుతున్నారో అది కూడా మరచిపోయి తవ్వుకుని చివరికి ఏమీ సాధించకుండా... ఆ కొండను ధ్వంసం చేసి అలా వదిలి వెళ్ళిపోతారు. సరిగ్గా ప్రపంచ అధినేతలందరూ కలిసి కోపెన్ హాగన్ లో చేసింది ఇదే.
కోపెన్ హాగన్ లో జరిగిన ధరిత్రి సదస్సులో మొత్తం 190 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరి లక్ష్యం భూమి తాపాన్ని తగ్గించడం. భూ ఉష్ణాగ్రత పెరగడం వల్ల వచ్చే నష్టాలు అందరికీ తెలుసు. అలాంటి నష్టాలను నివారించి ఆ లక్ష్యం కోసం అక్కడ చేరినవారు చేసిందేమిటో ఒక్కసారి చూద్దాం.
ఈ సమావేశానికి మొత్తం 10,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ పది వేల మంది చర్చించే అంశం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ విషయం ప్రపంచానికి అందించేందుకు దాదాపు 50 వేల నుండి లక్ష మంది మీడియా ప్రతినిధులు అక్కడికి చేరారు. అంటే మొత్తం లక్ష మంది ఆ నగరానికి చేరారని అంచనా. కోపెన్ హాగన్ నగర జనాభా ఐదు లక్షలు. అంటే ఆ నగరం మీద ఐదో వంతు జనాభా వచ్చి పడ్డారు. లక్ష మంది అతిథులు దాదాపుగా రెండు వారాలు ఆ నగరంలో ఉన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|