|
|
Articles: TP Features | రాజ్యాంగానికి షష్టిపూర్తి - Site Administrator
| |
ఈ వైరుధ్యాల నేపథ్యంలో మన రాజ్యాంగం 50 సంవత్సరాల పనితీరును మదింపు చేయమని అప్పటి ప్రభుత్వం 23-2-2000న విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఎస్.వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమించింది. ఆ సంఘం తన నివేదికను 31.3.2000న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికే సమర్పించింది.
వారు గమనించిన ముఖ్యాంశాలు :
1.ఎన్నికలు సక్రమంగా జరిగే, రాజ్యాంగ సవరణ వల్ల పంచాయతీలకు కూడా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం బలపడింది.
2. ప్రజాప్రతినిధుల విద్యార్హతలు మెరుగుపడడమే కాకుండా అన్ని వర్గాల నుండి ప్రజాప్రతినిధులు వస్తున్నారు.
3. ఎన్నికల ప్రక్రియ మెరుగుపడవలసిన అవసరం ఎంతో ఉంది. ఎన్నికల్లో నేరస్థులను, అసాంఘిక శక్తులను పాల్గొనకుండా, ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రక్రియను స్వాధీనం చేసుకోకుండా చేయవలసిన అవసరం ఉంది.
4. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. ఇంకా అందరికీ సమానావకాశాలు రావటం లేదు. ఉదాహరణకి స్త్రీలకు వారి సంఖ్యకు తగ్గ ప్రాతినిథ్యం రావటం లేదు. పార్లమెంటులో స్త్రీల ప్రాతినిద్యం దాదాపు 10 శాతమైతే, ప్రభుత్వ సర్వీసుల్లో అది 5 శాతం. న్యాయవ్యవస్థలో అయితే అది 3 శాతం మాత్రమే.
5. ఎన్నికల ప్రక్రియని ఎన్నికల్లో జరిగే ఖర్చు, అవినీతి కలుషితం చేస్తోంది.
6. రాజకీయ పార్టీల్లోని నేరచరితులు మొత్తం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా ప్రభుత్వ నిర్వహణలోని విలువల్ని కూడా దిగజారుస్తున్నారు.
7. రాజకీయపార్టీల నిర్వహణకు ఎటువంటి చట్టమూ లేకపోవడం వల్ల వారి నిధుల సమీకరణ గురించి, పద్దుల గురించి, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేకపోతోంది.
8. జాతీయ పార్టీలు జాతి ప్రాధాన్యత కంటే, వ్యక్తి ప్రాధాన్యతకీ, అవకాశవాద రాజకీయాలకీ ఎక్కువ అవకాశమిస్తున్నాయి.
9. అవినీతి కారణంగా ప్రభుత్వ పనితీరు, న్యాయవ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లింది. ప్రజలు రాజ్యాంగ సంస్థలపై కాకుండా రాజ్యాంగేతర శక్తులపై ఆధారపడడం ఎక్కువైంది.
10. ప్రభుత్వాలు ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, రాజ్యాంగ విలువల పట్ల విశ్వాసం పోయింది.
ఇంతే కాకుండా వైజ్ఞానికంగా ముందుకెళ్తున్న ప్రపంచంతో మనం ప్రయాణించలేకపోతున్నామని, రాను రాను దేశం అప్పుల ఊబిలో మునిగిపోతోందని, పాలకుల్లో దేశ సమగ్రత, రక్షణ గురించి సరైన ఆలోచన లేదని, విపత్తు, అవాంతరం వచ్చిన సమయంలో ఎదుర్కోవడానికి తగిన తక్షణ ప్రణాళిక లేదని, అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా గొప్పలు చెప్పుకుంటున్నా దిగజారుతున్న రాజకీయ విలువలు మనల్ని పరిహాసం చేస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోకపోవడం వల్ల మైనారిటీ ప్రభుత్వాలు ప్రజల్ని పరిపాలిస్తున్నాయని, రాజకీయ అస్థిరత్వం వల్ల తరచుగా వచ్చే ఎన్నికలు ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయని కూడా పేర్కొంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|