|
|
Articles: TP Features | తెలంగాణ - ఆత్మహత్యలు - Site Administrator
| |
పోరాటంలో, ఉద్యమంలో చంపడం ఉంటుంది కాని స్వయంగా చంపుకోవడం ఉండదు. చంపడం, చావడం రెండూ అన్యాయమైన పనులే. అయినా మన దేశంలో ఇవి నడుస్తూనే ఉన్నాయి. తెలంగాణాలో మరికొంచెం ఎక్కువ. గాంధీ చెప్పిన ఆమరణ ఉపవాస దీక్షకు కొనసాగింపు చర్య ఆత్మాహుతి అని కూడా కొందరు వివరిస్తున్నారు. కాని ఇది అమానవీయమైనది. ఇలా ఉపవాస దీక్ష చేసి అసువులు బాసినవారు గాంధీపథంలో పట్టుమని పది మంది అయినా లేరు. 'పెద్దలు' ఉపవాస దీక్ష చేసేటప్పుడు చావకుండా అన్ని 'సమీకరణలు' చూసుకునే కూర్చుంటారు. ఇందులో అన్యాయంగా బలి అయ్యేది నాయకులను నమ్మే అమాయక సాధారణ జనం మాత్రమే. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అంత పెద్ద జాతీయ ఉద్యమంలో ఇలా చనిపోయినవారు ఇద్దరు, ముగ్గురు మించి లేరు. ఇతరత్రా అక్కడక్కడా ఎవరైనా పోయినా వారు పెద్ద నాయకులు కాదు. పొట్టి శ్రీరాములు ఉపవాస దీక్ష మరణాన్ని మనవారు నేటికీ పొగుడుతూనే ఉన్నారు.
చంపడం, చంపబడటం రెండూ అన్యాయమైనవే. అయితే తనకు తాను చంపుకోవడం పరమ అన్యాయం. 'మహాపాపం' చివరికి నేరం కూడా. ఇలాంటి చర్యలను వీలైన అన్ని రీతులా నిర్వహించాల్సిందే. కన్న కొడుకుకు తలకొరివి పెట్టే 'రాత'ను ప్రపంచంలో ఏ తండ్రీ కోరుకోడు. అది వారికి 'శాపం' లాంటిది. కొడుకు ప్రాణం నిలబడుతుంది అని అనుకుంటే ఏ తల్లితండ్రులు అయినా వారి ఆయుష్షును కొడుకుకు పోసి బ్రతికించుకుంటారు. ఈ విషయాన్ని యువత, విద్యార్థి లోకం గమనించాలి. తండ్రికి, తల్లికి గర్భశోకం పెట్టే హక్కు ఏ కొడుక్కీ, కూతురికీ లేదు, ఉండదు. ఈ పని చేసిన వారు ఇలాంటివి ప్రోత్సహించిన వారు రాక్షసులు కిందే లెక్క. ఇక తప్పదు తన ప్రాణం పోతుంది అన్నప్పుడు ఒక తల్లి, ఒక తండ్రి ఎంత బాధపడతారో అంతకన్నా ఎక్కువ తన సంతానం ప్రాణం పోతుంది అన్నప్పుడు బాధపడతారు. ఇంతటి శిక్షను, క్షోభను తల్లితండ్రులకు మిగల్చవద్దు.
ఉద్యమం తెలంగాణ ఎక్కడికీ పోదు, ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. బ్రతికి పోరాడి సాధించుకోవాలి. జీవితాన్ని గెలుచుకోవాలి, సాధించుకోవాలి. విజయాన్ని సాధించి విజయ ఫలాలు తన వారికి పంచి ఆనందించాలి. అంతే కాని మనిషికి అత్యంత విలువైన ప్రాణాలను పణంగా పెట్టి ఏ ఉద్యమాన్నీ నడపాల్సిన అవసరం లేదు. శవాల మీద నడిచే ఉద్యమం ఉద్యమం కానే కాదు. దీన్ని జనం గుర్తించాలి. ఆత్మ బలిదానం గొప్పదని నాయకులు, కవులు, మీడియా చెప్పే బక్వాస్ మాటలు నమ్మవద్దు. చచ్చి సాధించేది ఏమీ లేదు, బ్రతికి సాధించుకోవాలి. ప్రాణత్యాగం మహా గొప్పది అని మాటలు చెప్పేవారిని నమ్మడం అమాయకత్వం, వెర్రితనం తప్ప ఇంకోటి కానే కాదు. ఇలాంటి మాటలను స్వార్థపరులు, నీచులు పరుల శ్రమ మీద, త్యాగాల మీద బ్రతికేవారు మాత్రమే చెబుతారని అని జనం బాహాటంగానే అంటున్నారు.
చావడం ఎప్పటికీ గొప్పకాదు. ఏ రకంగానూ గొప్ప కాదు. 'త్యాగాలన్నింటిలో ప్రాణత్యాగం గొప్పదని' చెప్పేవాడు హంతకుడితో సమానం. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. వాడిని చంపు అనడం ఎంత దుర్మార్గమో, నువ్వు చావు అనడం అంతే దుర్మార్గం. అది ఏ మతం అయినా, ఉద్యమం అయినా, కారణం ఏదయినా చావులను ప్రోత్సహించేవాడు హంతకుడే. చావును కీర్తించే వారు కూడా దాదాపు హంతకులతో సమాన.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|