|
|
Articles: TP Features | క్షమించు యాదయ్యా.. - Site Administrator
| |
(దుర్గం రవీందర్)
సిరిపురం యాదగిరి (యాదయ్య) ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఫిబ్రవరి 20 మధ్యాహ్నం పెయికి అగ్గి అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసుకొంటున్నానని సూసైడ్ నోట్ లో విస్పష్టంగా పేర్కొన్నాడు. అతనిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం పొద్దుపోయాక యాదయ్య చనిపోయాడు. అదే రోజు అర్ధరాత్రి యాదయ్య మృతదేహాన్ని అతని స్వగ్రామం నాగారం (రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం) తరలించి వారి ఆచారం ప్రకారం బొంద పెట్టారు. తెలంగాణ గ్రామాల్లో పెళ్ళి కాని యువతి, యువకులు చనిపోతే బొంద పెట్టడం ఆచారం. యాదయ్య చావు ఆచారం ప్రకారమే జరిగి ఉంటే ఇందులో చర్చించడానికి గాని, ఆశ్చర్యపోవడానికి గాని ప్రత్యేక వ్యాసం రాయడానికి గాని ఏమీ ఉండదు. కాని అలా జరగలేదు. పోలీసులు వారిదైన వ్యూహాత్మక ధోరణిని ప్రదర్శించారు.
యాదయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తరువాత విశ్లేషిద్దాం. ఆత్మహత్యాయత్నం దగ్గర నుండి ఏం జరిగిందో చూద్దాం.
యాదయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నది యూనివర్శిటీ గేట్ ముందు. వెంటనే 108 వాహనం వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సమీప ఆసుపత్రికి పేషెంటును తీసుకెళ్తారు. ప్రక్కనే అర కిలోమీటరు దూరంలో ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రి ఉంది. యూనివర్శిటీ అవతలి గేట్ దగ్గర ఆర్టీసీ ఆసుపత్రి ఉంది. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఒకవైపు ఉస్మానియా ఆసుపత్రి ఉంది, ఇంకో వైపు గాంధీ ఆసుపత్రి ఉంది. మొదట గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం అని, ఎక్కడో సాగర్ రింగ్ రోడ్ దగ్గర సైఫాబాద్ అవతల ఉన్న డిఆర్ డిఎల్ అపోలో ఆసుపత్రికి యాదయ్యను ఎందుకు తరలించినట్లు? సాయంత్రం యాదయ్యను చూడడానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చింది. అక్కడ ఉన్న తెలంగాణ వాదులు కొందరు ఆమెను నిలదీశారు. 'ఏమిటీ అన్యాయం, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా మీరు పట్టించుకోరా. మీ మంత్రి పదవులే మీకు కావాలా, తెలంగాణ వద్దా' అని వారు అడిగారు. దీంతో ఆవిడ కోపంతోనే అక్కడి నుండి నిష్క్రమించారు. సబితను ప్రశ్నించిన ఫిరోజ్ ఖాన్ అనే కరీంనగర్ విద్యార్థి పోలీసుల చేతిలో పడి సోమవారం సాయంత్రం దాగా ఆచూకీ లేకుండాపోయాడు. 20వ తేదీన సాయంత్రం పొద్దుపోయాక యాదయ్య మరణించాడు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|