|
|
Articles: TP Features | క్షమించు యాదయ్యా.. - Site Administrator
| |
మొత్తం మీద పోలీసులు ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాదయ్య శవాన్ని బొంద పెట్టేశారు. యాదయ్య శవంతో పాటు తెలంగాణ సమస్యను బొంద పెట్టేశాం అని కించిత్తు గర్వంగా ఊపిరి పీల్చుకొని ఉంటారు. పోలీసు మంత్రి సబిత, ముఖ్యమంత్రి రోశయ్య ఈ విషయాన్ని గమనించనట్లే ఉండిపోయారు?
ఇలా శనివారం మధ్యాహ్నం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యాదయ్య రాత్రికి శవమయ్యాడు. ఆదివారం ఉదయం దాదాపు అదే వేళకు బొంద పెట్టబడ్డాడు. అతి సాధారణ రీతిలో, అసాధారణ పోలీసు బలగాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. యాదయ్య నక్సలైట్ కాదు కాబట్టి మానవహక్కుల సంఘాలు యాగీ చేయవు. యాదయ్య అగ్ర కులం వాడు కాదు కాబట్టి వారి కనుసన్నల్లో మెదిలే మీడియా, ప్రజా సంఘాలు ఏమీ మాట్లాడవు. యాదయ్య టిఆర్ఎస్ నాయకుడు కాదు కాబట్టి వారూ నోరెత్తి మాట్లాడరు.
యాదయ్య తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నాడు. అతని అంత్యక్రియలు కెసిఆర్, జయశంకర్, కోదండరామ్, దామోదర్ రెడ్డి లాంటి నాయకులు వేసే మొదటి పిడికెడు మట్టితో మొదలుకొని తెలంగాణ విద్యార్థులందరూ వేసే తలో పిడికెడు మట్టితో జరగాలి. అలా వేసిన మట్టి గుట్టగా ఏర్పడాలి. అది జహంగీర్ దర్గాలాగా తెలంగాణ వారందరికీ పుణ్యక్షేత్రం కావాలి. పాపం యాదయ్య అనామకంగా కొండంత త్యాగానికి పిడికెడు మట్టికి, పిసరంత గౌరవానికి కూడా నోచుకోలేదు. తప్పు చేసిన పౌరుడి వలే పోలీసుల పహారాలో ఖననం అయ్యాడు. యాదయ్యా క్షమించు నీ త్యాగానికి ధైర్యానికి తగిన చావును నీకు చేయలేకపోయాం!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|