|
|
Articles: My Thoughts | మంచి పుస్తకాలు - Site Administrator
| |
చిన్నతనం నుండి చదువు ద్వారా లభ్యమయ్యే డబ్బు, దానిపట్ల వ్యామోహాన్ని పెంచి పిల్లల్ని డబ్బు సంపాదించే యంత్రాల్లా మలుస్తున్న తండ్రులు మిక్కిలిగా ఉన్న సమాజంలో 'సమస్త ప్రాణులూ పెద్దవిగాని, చిన్నవిగాని, బలహీనమైనవిగాని, బలమైనవిగాని, దగ్గరగా ఉన్నవి గాని, దూరంగా ఉన్నవిగాని, పుట్టినవి గాని, పుట్టబోయేవి గాని అన్నీ ఎప్పుడూ శాంతి సౌఖ్యాలతో ఓలలాడాలని కాంక్షిస్తూ' పిల్లల్ని మానవతా విలువలు కలవాళ్ళుగా పెంచిన వెంకటయ్య నాయుడు గారు ధన్యజీవి. ఆయన్ను గూర్చి చదివాక ఎవరికైనా ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేది అన్పిస్తుంది.
డబ్బుపై కాకుండా తెలుగుభాషపై మమకారాన్ని ఉగ్గుపాలతో బిడ్డలకు అందించాడు. అలా అందించిన తండ్రిని అందుకొని ఆచరించిన తనయుడు - ఇద్దరూ అభినందనీయులే.
రెండో పుస్తకం 'వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలం' అనే శీర్షికతో ఉంది. మొదటి పుస్తకం పూర్తిగా చదివి ఉండకపోతే దీన్ని సైతం అపార్ధం చేసుకునేవాణ్ణి. ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూల కోసం తయారయ్యే నిరుద్యోగ యువకుల్ని దోచుకునే చౌకబారు ఎత్తుగడతో కొందరు తెలివైన రచయితలు ప్రచురించే వ్యక్తిత్వ వికాసం పుస్తకాల కోవలోనే దీన్ని సైతం అర్దం చేసుకునేవాణ్ణి.
కాని ఇది ఉన్నతంగా వికసించిన వ్యక్తిత్వాలున్న 50 మంది సుప్రసిద్ధుల వ్యక్తిత్వాల్ని మల్చిన సంఘటనల సమాహారం. క్లుప్తంగా చెప్పిన 50 మంది ప్రముఖుల జీవిత చరిత్ర.
చాలా పేద స్థితి నుండి ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి రావటమే గొప్పగా టాటా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని గూర్చి కథలు కథలుగా కన్పించే కథనాలతో పుస్తకాలు చాలా ఉన్నాయి. డబ్బు సంపాదించటమే పరమావధిగా భావించేవారికి ఆయా వ్యక్తుల జీవితాలు ఆదర్శప్రాయం కావచ్చు.
అగ్రిమెంట్లు చేతులు మారటం ద్వారా నిమిషాల్లో కోట్లు సంపాదించే రియల్టర్లు, పలుకుబడితో సంపాదించిన పర్మిట్లు, కాంట్రాక్టుల అమ్మకం ద్వారా గోతాలకొద్దీ డబ్బు సంపాదించే రాజకీయ బ్రోకర్లు, అవినీతి ద్వారా సంపాదించే అధికారులు ఉండడం ఈ రోజు చాలా సాధారణ విషయంగా మారింది. అలా సంపాదించిన వ్యక్తుల్ని కూడా కొందరు ఆదర్శంగా చెప్పుకోవచ్చునేమోకాని కోట పురుషోత్తం గారు చెప్పిన 50 మంది వ్యక్తి వికాసాలు అలాంటివి కావు.
'మా ఊరుని వొదిలేసిన నాకు దరిద్రం తీరింది. ఒకసారి నాకు జ్వరం వస్తే వారం దినాలు సాకిరేవుకు పోలేదు. ఒక రెడ్డొచ్చి ఒంటిమీద మాసిపోయిన బట్టల్ని చూపించి 'ఏమిరా ఈ గుడ్డలేస్కొని ఎట్టతిరగాలా?' అన్నాడు. నేను జ్వరంతో చస్తావుంటే ఈ రెడ్డొకడు అని చెప్పి దానికి అయ్యవార్ని పోయి అడుగు' అన్నా. అంతే నా మెడ జివ్వాలకు పట్టి ఒకటిచ్చాడు. ఆ రోజే ఊరిని వొదిలేసినా. ఇది జరిగి ఇరవైయేండ్లు అవుతావుంది. ఈ టవున్లో నన్ను ఒరే అన్నోడు, కొట్టినోడు లేడు. రోజూ 150 రూపాయలు సంపాదించుకుని మౌనంగా బతకతా ఉండా. ఊల్ళో ముట్టుబట్టల్ని కూడా ఉతికింది తల్చుకుంటే ఇప్పుడు పేగులు లోపల్నుంచి బయటకు పెరుక్కొస్తా ఉండాయి' అని తన కవితని ఎవరికో వివరిస్తున్న చాకలి యువకుని ప్రేరణ ఈ పుస్తకంలోని పేజీలో కనబడుతుంది.
తన తండ్రిని రారా అని రెడ్ల పిలగాడు పిల్చిన క్రోధం ఇనుకొండ సుబ్రమణ్యంను తిరుపతి క్షురకుల సంఘం మీదుగా రాష్ట్ర నాయీబ్రాహ్మణులకు నాయకునిగా ఎదిగిన వైనాన్ని చక్కగా వివరించారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|