|
|
Articles: My Thoughts | మంచి పుస్తకాలు - Site Administrator
| |
(చెరుకూరి సత్యనారాయణ)
చానాళ్ళకు నేను చదివిన మంచి పుస్తకాలు రెండూ ఒకే కలం నుండి వచ్చాయి. అవి కోటపురుషోత్తం (తిరుపతి) గారి 'తెలుగు పద్యమూ - మా నాన్న', 'వ్యక్తిత్వ వికాసానికి సంఘటనే మూలం'.
శీర్షికలు చూస్తే చాలా పేలవంగా కన్పించాయి. తమతమ కుటుంబ సభ్యుల్ని గూర్చి కవిత్వం రాసుకున్న మరికొందరు కవులు కూడా ఉన్నారు. అందులో తప్పు లేదు. కాని ఆ పుస్తకాల్ని కొని చదవమని లోకం మీదకు వదలడంలో జౌచిత్యం కన్పడదు. అలాంటి భావనల్తో ఉండి మొదటి పుస్తకాన్ని తెరిచాను.
దిగ్భ్రమ కలిగించిన 30 పేజీల నాన్న. ఇంతమంచి తండ్రి, ఇంత విశాల భావాలున్న తండ్రి అందరికీ ఉంటే సమాజ పురోగతి మరోలా ఉండేదనే అభిప్రాయం కలిగింది.
కుక్కపిల్లపై రాయి విసరటంలోని తప్పుని, చెట్టునాటటంలోని అవసరాన్ని, బిక్షవేయటంలోని పుణ్యాన్ని, గాటికాడ ఎద్దు నోటికి పచ్చగడ్డి అందించడంలోను - పిచ్చుకలకు బియ్యంనూక వెయ్యటంలోని తృప్తిని, పెద్దలను గౌరవించటంలో గొప్పని నేర్పిన తండ్రి.
చదువంటే తెలియని ఊళ్ళలో అయినా మగపిల్లల్ని చదివించడంలో విశేషం లేదు. ఆడపిల్లలు చదువుకుంటే కుటుంబానికి, సమాజానికి ఉపయోగమని భావించి కూతుర్ని పోస్టుగ్రాడ్యుయేట్ గా చేసిన తండ్రికి తెలుగు పద్యంపై ఉన్న మమకారాన్ని గుర్తు చేస్తూ తెలుగులో ప్రసిద్ధమైన పద్యాలన్నీ ఒక్కచోట గుదిగుచ్చటమే కాక తెలుగుభాషపై ప్రసిద్ధ కవులు రాసిన పద్యాలను కూడా సంకలనం చేయటం ద్వారా ఈ పుస్తక ప్రాముఖ్యత మరింత హెచ్చింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|