|
|
Articles: My Thoughts | మంచి పుస్తకాలు - Site Administrator
| |
కవులు - రచయితలు అయిన ప్రముఖ నిర్మాత దర్శకులు మల్లెమాల (యం.యస్.రెడ్డి), ఉండేల మాలకొండారెడ్డి, సింగమనేని నారాయణ, యస్వీ సత్యనారాయణ, పెనుగొండ లక్ష్మీనారాయణ, మృణాలిని, సుద్దాల అశోక్ తేజ, ఎండ్లూరి సుధాకర్, కొండ్రెడ్డి, మాడభూషి శ్రీధర్, కే.శివారెడ్డి, సామల రమేష్ బాబు, సం.వెం.రమేశ్ తదితరుల జీవితాల్ని - సంఘటనల్ని - నూరు పేజీల్లో రాయటం కష్టం. ఇబ్బంది అలాంటిది. వారి జీవిత వికాసాన్ని మూడు పేజీలకు కుదించి రాయగల పురుషోత్తం గారి రచనాపాటవం ప్రశంసనీయం.
ఈ పుస్తకం చదవక ముందు యస్.పి.వై.రెడ్డి (నందిపైపులు - నంద్యాల పార్లమెంటు సభ్యులు), యం.యస్.రెడ్డి (సినీ నిర్మాత, దర్శకులు), గల్లా రామచంద్రనాయుడు (మంత్రి అరుణ భర్త అమర్ రాజా బ్యాటరీల అధినేత) శాంతా బయోటెక్ వరప్రసాద్ తదితర పారిశ్రామికవేత్తల పట్ల ఉన్న అభిప్రాయాల్ని మార్చుకున్నాను.
వికసించిన వ్యక్తిత్వమంటే వ్యాపారం చేయటంలోనూ, పరిశ్రమలు నిర్వహించటంలోనూ, వృత్తులను కొనసాగించటంలోనూ సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని వీరంతా నిరూపించారు. మనస్సుంటే ఎక్కడైనా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయవచ్చని చేసి చూపించిన అనేకమంది వ్యక్తిత్వ వికాసాల్ని ఈ చిన్న పుస్తకంలో చూడగలిగాను. అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఎన్నుకోవటంలోనూ వారి జీవితాల్ని ఇందులో పొందుపరచటంలోనూ వ్యక్తిగానూ, రచయితగానూ పురుషోత్తంగారు కృతార్ధుడయ్యారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|