అన్ని భాషలకీ తల్లి సంస్కృతమేనా?-
ఈ విషయం మీద బాగా ఆలోచించాల్సిందే! అన్ని భాషల్లోనూ అక్కడక్కడ ఈ సంస్కృత పదాలు తగిలి, ఆ భాషాభిమానులకి పంటి కింద రాయి పడ్డట్లవుతుంది. నేడు జనాలు ఎవరి భాష వారికి గొప్ప అని, మాతృభాషా వ్యామోహం చూపటం ముదావహం. Telugu is Italian of the East అనే కన్నా Italiyan is the Western Telugu అంటే నా వంటి వారికి నచ్చుతుంది. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని ఎన్నో గ్రంథాలను పరిశీలించి, ఎందరో పెద్దలూ - మేధావులూ సంస్కృతం అన్ని భాషలకీ తల్లి అని తేల్చారు. ఆంగ్లానిక్కూడా! మదర్ = మాతా! ఫాదర్ = పీటర్ = పిత - ఇలా ఎన్నో సూచించారు.
సరే! ముందు భాష అనేది ఎలా పుట్టింది అనేది ఆలోచిస్తే, మనకి అందరు పరిశోథకులూ ఒకే మాట అన్నారు. ప్రకృతిలోని శబ్దాలు విని వాటిని అనుకరిస్తూ భాష పుట్టింది. ముందు శబ్దం పుట్టింది- దాన్ని ధ్వని అన్నారు. దాన్ని హిందువులు ఓంకారం అన్నారు. ఉరుములూ - మెరుపులూ, పిడుగు పడ్డ శబ్దాలూ ఇవన్నీ ఆదిమానవులు చూసి శబ్దం నుంచే సృష్టి జరిగిందని తేల్చారు. నిజానికి ఏ ప్రాంతవాసులకు ఆయా భాషలు సహజంగా పుట్టుకొస్తాయి. ముందు సంజ్ఞలతోనూ తదుపరి బెబే - మెమ్మే- బ్బొబ్బో మాటలతోనూ, వస్తువులనూ పదార్థాలను చూపించి కావాలని సూచించిన వారు, తదుపరి ఆయా ప్రాంతాల్లో నివసించేవారు తమలో తాము
అర్థమయ్యే విథంగా మాటాడుకున్నారు. అది ద్రవిడ - తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం ఇంకా మరికొన్ని భాషలై కూచున్నాయి.
ఇంకొంచెం ఎదరకు వెడితే, ప్రతి వ్యక్తికీ - ఓ గుంపులకీ, వారికి మాత్రమే అర్థమయ్యే ప్రత్యేక భాష కావాలనిపించింది. ఇది ప్రయివసీ కోసమన్న మాట. చిన్నపిల్లలు పెద్దవారికి తెలీకుండా సంకేతాలతోనూ, మూకాభినయాలతోనూ, నయనావధానంతోనూ ఈలలతోనూ వారికి మాత్రమే అర్థమయ్యేలా మాట్లాడుకుంటారు. అలాగే 'క' - భాష, 'చ' - భాష అంటూ ఎన్ని అక్షరాల తరవాత తమ 'క'యో, 'గ'యో, 'చ'యో వేసి మాటాడుకుంటారు. ఇది రహస్య ప్రేమికులకు అవసరమై వారు మాత్రమే అర్థం చేసుకునేలా పదిమందిలో ఉన్నా మాటాడుకుంటారు. ఇవన్నీ తెలివితేటలున్న మేధో జీవుల విన్యాసం.
ఓ విదేశీయుడు నన్నడిగాడు. మీ దేశంలో విభిన్న భాషలూ విభిన్న సంస్కృతులుంటాయి. అది పాపులున్న దేశం. అందువల్ల మీరు ఏక తాటి మీద లేరు అన్నాడు. ఇలాంటి దానికే మన దేశ మేధావి అన్నాడు 'గుఱ్ఱాలు అనేక రంగుల్లో ఉంటాయి కాని గాడిదలు ఒకే రంగులో బూడిద పూసుకున్నట్టుంటాయి' అని. అప్పుడా విదేశీయునికి ముఖం చెల్లలేదు. ఇప్పుడు 'అతి చిన్న సంఖ్యనీ - అతి పెద్ద సంఖ్యనీ చెప్పగల మేధావి గొప్పవాడా లేక ఒకచోట ఆగిన వాడు గొప్పవాడా?' అని అడిగితే, కాలాన్ని అతి సూక్ష్మ విదశల్లో గుణించినవాడు గొప్పవాడని తెలుస్తుంది. ఈ కాల నిర్ణయాలూ, గణితాలకు హిందువులు ఆద్యులు. విభిన్న భాషలూ - సంస్కృతులున్న దేశంలోని వారు తెలివైనవారని తెలుస్తుంది. ఎవరి సంస్కృతీ - భాషా ఆ విధంగానే అభివృద్ధి చెందాయి.
|