ప్రజలు ఈ జాప్యాన్ని భరించలేకపోతున్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కూడా ఇది చాలా ఇబ్బందిగానే ఉంది. జీతాలు కూడా ఆలస్యం అవుతూ ఉండడంతో పరిస్థితి మార్పు కోరింది. `ఇష్ట పూర్వకంగా లంచం ఇచ్చిపుచ్చుకోవచ్చు. కానీ చెప్పుతో కొట్టే ప్రక్రియ మాత్రం జరగాలి. లంచం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు పరస్పరం చెప్పుతో కొట్టుకోవాలి. వేరే కేసులు, శిక్షలు ఉండవు. చెప్పు శిక్ష అమలవుతుంది గాబట్టి - ఇద్దరూ పరిశుద్ధులే అవుతారు!'
ఇది అందరికీ నచ్చింది. ప్రభుత్వపాలన సుఖంగా సాగుతోంది. ఈ చెప్పుదెబ్బల వ్యవహారం ఇతర దేశాల్లో విమర్శకు గురయింది. ఇది చాలా అనాగరికం అన్నారు. దాంతో మళ్ళీ చట్టానికి సవరణ జరిగిందిలా -
`చెప్పు రూపంలో బంగారు ఉంగరం చేయించుకుని, చూపుడువేలుకి ధరించాలి. ఎవరైనా లంచం అడిగితే బంగారు చెప్పు ఉంగరం చూపుడువేలుతో లంచం అడిగినవాణ్ణి దవడమీద సుతారంగా కొట్టాలి. అది చెప్పుతో కొట్టినదానితో సమానం. అలాగే, లంచం ఇస్తానన్నందుకు అతణ్ణి, లంచం తీసుకున్నవాడు బంగారు చెప్పు ఉంగరంతో ఇతడి దవడమీద సుతారంగా కొడతాడు! ఇక ఇద్దరూ పరిశుద్ధులే.'
ఇవ్విధముగా అవినీతి అంతమయి, మరల గౌరవప్రదంగా మొదలయినది.
|