సోనియా వద్దకు జగన్! ఇదంతా ఒక ఎత్తయితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవీ కాలం కన్నా ఎక్కువ రోజుల పాటు తనను సీఎం గా కొనసాగంచాలని అధిష్టానాన్ని రోశయ్య కోరారన్న వార్తలను వైఎస్ వర్గం ఆసక్తిగా చర్చిస్తోంది. తొలుత తెలుగుదేశం అధికారంలోకి రావడానికి కారణం తరచూ ముఖ్యమంత్రులను మార్చడమే. సీఎం అంజ్యయకు విమానాశ్రయంలో జరిగిన అవమానం, కీలుబొమ్మలను మార్చినట్టు ముఖ్యమంత్రులను మార్చడం తదితర కారణాలను చూపిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానం ఢిల్లీ నడిబజారులో తాకట్టు పెట్టారంటూ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ధ్వజమెత్తారు. అప్పట్లో భవనం వెంకట్రామ్ 1982 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరం కోట్ల విజయభాస్కరెడ్డి ముఖ్యమంత్రిగా రంగప్రవేశం చేశారు. తదుపరి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ను మట్టి కరిపించడంతో రాష్ట్రంలో తెలుగుదేశం శకం ఆరంభమైంది.
Pages: -1- 2 News Posted: 29 September, 2009
|