వైఎస్ సంతాపసభ
కడప : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికి విశేష సేవలందించిన దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంతాపసభ కడప జిల్లా పులివెందులలో జరిగింది. ఈ సంతాపసభకు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు వైఎస్ కు నివాళులు అర్పించారు. నాయకులు వైఎస్ తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పేదల ప్రజల బాగుకోసం నిరంతరం ఎనలేని కృషిచేసిన నేత వైఎస్ అని వారు కొనియాడారు. వైఎస్ అమర్ రహై అంటూ జోహార్లు అర్పించారు. ఈ సంతాపసభలో ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డితో పాటు కడప జిల్లా నాయకులు పాల్గొన్నారు.
News Posted: 9 September, 2009
|