కుందూ నది ఉగ్రరూపం
కడప : జిల్లాలోని కుందూ నది ఉగ్రరూపాన్ని వదిలిపెట్టలేదు. కుందూ వరద తీవ్రత కారణంగా రాజుపాలెం మండంలోని ఐదు గ్రామాలు నీట మునిగిపోయాయి. జిల్లాలోని పెద్దముడియ మండలం నెమ్మలదిన్నె, బలవనగూడూరు, గరిశెలూరు, చినముడియం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నయి. బాధితులను ఆదుకునేందుకు అధికారులు అహరహం శ్రమిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాధితుల సహాయం కోసం వచ్చిన 20 బోట్లు కర్నూలు జిల్లా నంద్యాల దాటి వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది. రెండు రోజులుగా బాధితులు ఆహారం, మంచినీరు లేక అల్లాడిపోతున్నారు.
News Posted: 5 October, 2009
|