క్వాలీస్ బోల్తా : ముగ్గురి మృతి
అనంతపురం : అనంతపురం రూరల్ పరిదిలోని బత్తిలపల్లి, మన్నీలగ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నేతాజీ, ఇమ్రాన్ పటాన్, హుస్సేన్భాషలు మృతి చెందినట్లు గుర్తించారు. బంగారు వ్యాపారం చేసుకుని నేతాజీతోపాటు మరికొంతమంది కలసి బంగారు రికవరీకోసం కదిరి నుంచి మూడు క్వాలీస్ వాహనాల్లో అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మన్నీల గ్రామ సమీపంలోనికి రాగానే క్వాలీస్ వాహనంకు ముందు ఉన్న టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు క్వాలీస్ వాహనంలో 9 మందిఉన్నట్లు సమాచారం.
News Posted: 10 November, 2009
|