రోడ్ టెర్రర్- 6గురి మృతి
కరీంనగర్ : జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని 108 వాహనంలో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. రామగుండం మండలం బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జి వద్ద హైదరాబాద్ నుంచి గోదావరి ఖని వెళ్తున ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రమేష్ కూడా మరణించాడు. ప్రమాదం వార్త తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయ చర్యలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో కొందరు హైదరాబాద్ మలక్ పేటకు చెందినవారని తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు.
News Posted: 21 December, 2009
|