మార్చి 27న సమీక్ష
కాకినాడ : గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే వివిధ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సమీక్షా సంఘాలను నియమించింది. జిల్లా సంఘ చైర్మన్ గా కేంద్ర మంత్రి పళ్లంరాజు, కో చైర్మన్ లుగా అమలాపురం ఎంపీ హర్షకుమార్, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అరకులోయ ఎంపీ కిశోర్ చంద్రదేవ్ లు వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు. జడ్పీ చైర్మన్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మార్చి 27న సమావేళమై జిల్లా గ్రామీణాభివృద్ధిపై సమీక్ష జరుపునుంది.
News Posted: 9 January, 2010
|