కర్నూలు : ప్రైవేటు రంగానికి తీసిపొకుండా వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరగాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన రెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రైతులకు మేలు కలిగేలా విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. నంద్యాలలో జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. వాతావరణానికి సంబంధించి రైతాంగానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక రేడియో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.