|
|
Articles: TP Features | 'ఉపా' సర్కార్ ఫీట్లు, పాట్లు! - Mrs. Aravinda Desai
| |
కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (ఉపా) ప్రభుత్వం అయిదేళ్ళ పాలనలో శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన విజయాలు, పరాజయాలపై సాగిన సమీక్ష ఇది. ఉపా ప్రభుత్వం పట్టుదలతో ప్రారంభించిన ప్రతిష్టాత్మక సైంటిఫిక్ ప్రాజెక్ట్ లలో పాల ప్రొటీన్ తో కూడిన మొక్కజొన్నకు రూపకల్పన, రోజుకు పది లక్షల లీటర్ల సముద్ర నీటిని పరిశుద్ధమైన తాగునీటిగా మార్చే ఫ్యాక్టరీని సముద్ర మధ్యంలో ఏర్పాటు, చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. అయితే, పరిశోధనపై దేశం చేసే వ్యయాన్ని స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో రెండు శాతానికి పెంచుతామన్న ఉపా ప్రభుత్వ వాగ్దానం మాత్రం ఇంత వరకు అమలుకాలేదు. అనవసర జాప్యాలు సైంటిఫిక్ ప్రాజెక్టులను అడ్డుకున్నాయి. సైన్సుకు, వినూత్న సృజనలకు స్ఫూర్తి ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్నకీలకమైన చర్యల ఫలితాలు మరి కొన్నేళ్ళకు కాని కనిపించకపోవచ్చు.
ఉద్దేశపూర్వకంగా లేదా అప్పటికప్పుడు కలిగిన ఆలోచనలతో రూపొందించినా, కాకపోయినా, వైజ్ఞానిక కార్యక్రమాలతో సంబంధం ఉన్న ప్రభుత్వ శాఖలకు సూచించిన మంత్రం భవిష్యత్ పై పెట్టుబడి పెట్టడంగా కనిపిస్తున్నది. అవి కొన్ని విషయాలలో విజయాలు సాధించాయి, మరికొన్నిటిలో విఫలమయ్యాయి. కాని వాటి కార్యకలాపాలలో చాలా వరకు భవిష్యత్తుకు పునాదులు వేయడంపైనే దృష్టిని కేంద్రీకరించినట్లుగా కనిపిస్తున్నది.
అంతరిక్ష పరిశోధనలు, మానవసహిత యాత్రల దిశగా మన దేశం వేస్తున్న అడుగులలో కీలకమైనవి రెండు ఉన్నాయి. అవేమిటంటే 2007లో స్పేస్ క్యాప్స్యూల్ ను రికవర్ చేయడం, 2008లో చంద్రుని కక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాన్ని ప్రయోగించడం. అయితే, 'చంద్రయాన్ - 1'తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన విజయంతో కలిగిన ఆనందాన్ని ఒక విదేశీ వినియోగదారుని కోసం నిర్మించిన భారత భారీ ఉపగ్రం 'డబ్ల్యు2ఎం' వైఫల్యం దెబ్బ తీసింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|