|
|
Articles: TP Features | 'తెలుగు'పై పార్టీల ప్రేమ! - Site Administrator
| |
(సామల రమేష్ బాబు)
అధికారంలోకి రావాలనుకొంటున్న రాజకీయపార్టీలు తమ విధానాల్ని ప్రకటించాయి. ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లను ఇంతకు ముందెప్పుడూ లేనంత వివరంగా ప్రచురించాయి. ఈ విషయంలో తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు పోటాపోటీగా ఉన్నాయి. తరువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలూ, లోక్ సత్తా పార్టీ తమ తమ పరిమితుల్లో ప్రణాళికల్ని ప్రకటించాయి.
అధికార పార్టీగా కాంగ్రెస్ సహజంగానే తాము అధికారంలో ఉండి చేసిందేమిటో వివరించింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పాలనపై విమర్శనాస్త్రాలను సంధిస్తూనే, తాము అధికారంలోకి వస్తే సాధించదలచుకున్నదేమిటో తెలియజేసింది. తెలుగు భాషోద్యమాన్ని ఏ మాత్రం గుర్తించడానికైనా, తెలుగుభాష గురించి ఏమాత్రం ప్రస్తావించడానికైనా ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రణాళికలు తిరస్కరించినట్లు కనబడుతోంది. ఎక్కడా తెలుగు భాషా బోధన గురించి గాని, తెలుగు మాధ్యమంలో బోధన గురించి గాని, తెలుగులో పరిపాలన గురించి గాని, రాష్ట్రేతరాంధ్రుల భాషా సంస్కృతుల రక్షణ గురించి గాని ప్రస్తావనే లేదు. ఇక, తెలుగు కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ప్రసక్తెందుకొస్తుంది?!
ఈ రెండు పార్టీలు తమ దృక్పథాన్ని ఎంత స్పష్టంగా ప్రకటించాయో చూడండి.
కాంగ్రెస్ పార్టీ గత అయిదేళ్ళలో ప్రాథమిక విద్య, పాఠశాల విద్యలకు సంబంధించి పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలను బదలాయించామని చెప్పింది. గత అయిదేళ్ళ కాలంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చామనీ చెప్పింది. రాష్ట్రంలోని 638 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2008-09లో 5, 6 తరగతుల్లో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఇ సిలబస్ ను తమ ప్రభుత్వం ప్రారంభించిందనీ, ఎస్.సి, ఎస్.టి., బి.సి. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు ప్రాధాన్యతనిచ్చిందనీ తెలియజేసింది. 6,500 సక్సెస్ స్కూళ్ళను ప్రారంభించాలని ప్రతిపాదించిన తమ ప్రభుత్వం ఇందులో 6300 స్కూళ్లను ఇప్పటికే ప్రారంభించి, ఆరవ తరగతి నుంచి ఆంగ్లంలో కూడా విద్యాబోధన చేపట్టిందనీ తెలియజేసింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|