|
|
Articles: TP Features | నేతల 'వాయు' జపం - Site Administrator
| |
ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులంతా ప్రస్తుతం 'గ్యాస్' కబుర్లు చెబుతున్నారు. అయితే వారు చెప్పేది 'గ్యాస్' కాదు కాని... ప్రస్తుతానికి ప్రజలకు మిగిలేది 'గాలి' మాత్రమే! అలాగని నేతలను తప్పుగా అర్థం చేసుకోవలసిన పనిలేదు. వారు కొట్టే 'గ్యాస్' అంతా మనకు 'చమురు సహజవాయువు' అని పిలిచే గ్యాస్ కోసమే.
కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ క్షేత్రంలో రిలయన్స్ సంస్థ (ఆర్ ఐ ఎల్) వెలికి తీస్తున్న చమురు సహజ 'వాయు' నిక్షేపాల్లో ఆంధ్రప్రదేశ్ కు రావలసిన వాటా పెరగాలన్నదే నాయకుల తపనంతా! రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చకుండా గ్యాస్ ఎలా తరలిస్తారన్నదే రాజకీయ పార్టీల డిమాండ్ - ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో సహా ప్రజారాజ్యం, వామపక్షాలు, భాజపాలు గ్యాస్ కోసం ఉద్యమిస్తున్నాయి. ఉత్పత్తి వ్యయానికే ఈ గ్యాస్ ని రాష్ట్రానికి కేటాయించాలని కూడా కోరుతున్నాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ కొరత కారణంగా 1200 కోట్ల రూపాయలు నష్టం సంభవిస్తోంది.
గ్యాస్ కేటాయింపుల కోసం ఇప్పటికే రాష్ట్రంలో భాజపా ఆందోళన చేపట్టింది. ఇదే బాటలో పయనించేందుకు సీపీఐ, ప్రజారాజ్యం సిద్ధమవుతున్నాయి. ప్రజారాజ్యం నేత చిరంజీవి కాకినాడలో ధర్నా చేసేందుకు యోచిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా గ్యాస్ కేటాయింపుల వ్యవహారంలో సంతృప్తిగా లేరు. ధరలు కేటాయింపులపై ఇటీవల రాష్ట్రానికి కేల్కర్ అధ్యక్షతన ఆర్థిక సంఘం వచ్చినపుడు కూడా సిఎం వైఎస్ మొర పెట్టారు. ప్రధాని, పెట్రోలియం శాఖ మంత్రి తో సహా ఇతర ఉన్నతాధికారులకు ఇప్పటి వరకు 17 లేఖాస్త్రాలు సంధించారు. అయినా పలితం మాత్రం శూన్యం. రాష్ట్రానికి 7.6 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ (ఎంఎంఎస్ సీఎం) కేటాయించారు. ఈ మొత్తాన్ని ప్రాధాన్యతా క్రమంలో 10ఎంఎంఎస్ సీఎం వరకైనా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|