|
|
Articles: My Thoughts | మాట పదిలమే అమ్మడూ! - Site Administrator
| |
మన మొక్కసారి అట్లా వెనక్కి చూపుసారించినట్లయితే రాజుల మధ్య యుద్దాలు జరిగిన కాలం గుర్తుచేసుకొన్నట్లయితే... యుద్ధాలకి ముందు శాంతి చర్చలు కొనసాగించటానికి బాగా మాట్లాడగలిగే వ్యక్తులని రాయబారాలకు పంపిన వైనం ఉంది కదా! అంగద రాయబారం, సంజయరాయాబారం, శ్రీకృష్ణరాయబారం అలాంటివే కదా! ఈ రాయబారాలకు వెళ్ళే వ్యక్తులు ఇరుపక్షాలకు అంగీకారమైన, ఆమోదయోగ్యమైన పద్ధతిలో నొపపించకుండా మాట్లాడగలిగి ఉండాలి. అంతేకాదు, యుద్ధం లాంటిది జరిగితే రెండు వర్గాలకు జరిగే నష్టాలు - జరగకుండా ఉంటే కలిగే లాభాలు కూడా చెప్పగలగినవారై ఉండాలి. అట్లాంటి వారినే రాయబారార్ధం పంపేవారు. ఇక వెళ్ళనవారు పక్షపాత వైఖరి అవలంభిస్తే చేయగలిగిందేమీ లేదు... మొత్తం మీద కార్యసాధన అనేది వాళ్ళ 'మాటతీరు'పై మాత్రం ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి వారు నచ్చచెప్పినా, పని జరగకపోవచ్చు.
చిన్న బిడ్డల్ని అనునయించటం మొదలుకాని పెద్దల మధ్య జరిగే సంభాషణల దాకా మాటల ప్రభావం ఎంతగానో ఉంటుంది. పిల్లల్ని కసిరినట్లు, తిట్టినట్లు మాట్లాడితే నొచ్చుకుంటారు 'అమ్మా - బాబు - నాన్న - కన్నా' అని లాలిస్తే ఇట్టే వించారు. అందుకే తల్లి ఆ పద్ధతినే పట్టుకొంటుంది. ప్రేమగా, మెత్తగా, ముద్దుగా మాట్లాడే అమ్మ మాటలతో సరితూగే మాటలు ఇంకేవి ఉండవు... ఎన్ని రకాల ముద్దు పేర్లతో ఎన్ని విధాలుగా లాలిస్తుందో! ఆ మాటల్లో బిడ్డ నవరత్నాల కంటె ఘనుడవుతాడు. రామకృష్ణుల కంటే మించినవాడవుతాడు. జాబిల్లిని తలదన్నేవాడవుతాడు. మరికొంత మంది పెద్దలు పిల్లల్ని ఎప్పుడూ విమర్శిస్తూ మాట్లాడుతుంటారు. 'నీకేమీ చేతకాదు - నీ వెందుకూ పనికిరావు' అంటూ... అట్లాంటి మాటలు వినివిని నిజంగా 'నేనలాంటి వాడినేనేమో' అనుకొనే ప్రమాదం ఉంది. విమర్శకు లోనవుతూ పెంచబడ్డ పిల్లల్లో 'వ్యతిరేక దృక్పథం' పెంపొందే అవకాశం ఎక్కువే కదా!
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|