|
|
Articles: Politics | ప్రజాస్వామ్యం అపహాస్యం! - Site Administrator
| |
గతంలో ఎన్నికల కమిషన్ ఈ విధంగా అభ్యర్థుల ఎంపికపై ఏ పార్టీకి సలహాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నికల ప్రధాన కమిషనర్ గా సోనియాగాంధీ విధేయుడుగా పేరు పొందిన నవీన్ చావ్లాను నియమించిన అనంతరం ఈ విధంగా వ్యవహరించడం గమనార్హం.
ఆయుధాల అక్రమ వినియోగం ఆరోపణలపై టాడా కోర్టులో శిక్షపడిన సంజయ్ దత్ ను అభ్యర్థిగా ప్రకటించిన సమాజ్ వాదీ పార్టీ నాయకత్వానికి అలాంటి సలహాను ఎందుకు ఇవ్వలేదు? పలు తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడిన నాయకులు పోటీ చేస్తున్నారు. ఆయా పార్టీల నాయకత్వాలకు ఇలాంటి సలహాను ఎందుకు ఇవ్వలేదు.
వరుణ్ గాంధీ కోర్టులో లొంగిపోయే సమయంలో 144వ సెక్షన్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని కాకుండా, హత్యాయత్నం ఆరోపణలపై కూడా వరుణ్ గాంధీపై కేసులు నమోదు చేశారు. కోర్టు నుండి బెయిల్ పొంది బయటకు వస్తారనుకొని ముందురోజే ఆయనపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా వరుణ్ గాంధీని నివారించడమే ప్రధాన ఉద్ధేశ్యంగా కనిపిస్తున్నది.
రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని 29 సంవత్సరాల యువకుడిపై ఎందుకు ఇంతగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు? ఇందిరాగాంధీ మనవడు, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి పదవిని దక్కించుకోవాలని ఉత్సాహపడుతున్న తురుణంలో మరో మనవడు వరుణ్ గాంధీ జైలు పాలయ్యాడు.
వరుణ్ గాంధీ చేసినట్లు చెప్పబడుతున్న ప్రసంగం సిడిలను అవి తనవి కాదంటున్నాడు. శాస్త్రీయ విచారణ జరిపించి నిజం నిగ్గు తేల్చే ప్రయత్నం చేయకుండా ఎన్నికల కమిషన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొందరపాటుతో, రాజకీయ దురుద్ధేశ్యాలతో వ్యవహరించినట్లు భావించవలసి వస్తున్నది.
భాజపా నాయకత్వం సహితం మొదట్లో వరుణ్ గాంధీ పై చెలరేగిన దుమారంతో ఖంగు తిన్నది. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ప్రధానమంత్రి పదవికోసం ఎదురుచూస్తున్న ఎల్.కె.అద్వానీకి వారం రోజులు పట్టింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|