|
|
Articles: Festivals | దుర్గమ్మ కొలువైన వైనం - Site Administrator
| |
ఒడ్డునే ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి శుచిగా అమ్మవారిని దర్శించుకుంటుంటారు భక్తులు. కొందరు ఆడవారు అమ్మవారిని మెట్లదారి మీదుగా ప్రతి మెట్టుకూ పసుపు, కుంకుమలు రాసుకుంటూ అమ్మవారిపై వారికిగల అపారభక్తిని చాటుకుంటారు. ఆ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలకు ఎక్కువగా భవాని, దుర్గ, కనకదుర్గ అని పేర్లు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నవరాత్రులు తొమ్మిదిరోజులు అమ్మవారిని సర్వాలంకారభూషితంగా అలంకరించడం ఒక ఎత్తయితే...చివరి రోజు ముగింపు ఉత్సవంలో భాగంగా కృష్ణానదిపై బోటును రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి కృష్ణానదిపై అమ్మవారిని మూడుసార్లు ఊరేగించి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. తెప్పోత్సవం కోసం ఎక్కడెక్కడినుంచో జనం తరలివస్తుంటారు. ఆ ఉత్సవాన్ని చూడటానికి రెండు కన్నులూ చాలవంటారు.
భేతాళ నృత్యం ప్రత్యేక ఆకర్షణ
ఉత్సవాల ముగింపు రోజున విజయవాడ పాతబస్తీలో అమ్మవారి ఘటాలను ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు భారీ ఎత్తున కోలాహలంగా సాగుతుంది. పెద్ద ఎత్తున జనం తరలి వస్తారు. పాత బస్తీ నుంచి మొదలైన ఈ ఊరేగింపు వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్ద చేరడంతో ముగుస్తుంది. కాగా ఈ ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది భేతాళ నృత్యం అని చెప్పక తప్పదు. భేతాళుడు వందమంది అక్కాచెల్లెళ్లుగా పూజించబడే గ్రామదేవతలైన అమ్మవార్లకు ఒకే ఒక్క సోదరుడుగా చెబుతారు. అందువలన అమ్మవారి ఘటాల ఊరేగింపులో భేతాళ వేషధారి తప్పక ఉంటాడు. అతని ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరపడం ఆనవాయితీ.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|