|
|
Articles: Devotion | ఏక్ నాధ్ జ్ఞానబోధ - Mrs. Kanaka Durga
| |
ఒక ఉదయం యధావిధిగా ఏకనాధుడు స్నానం చెసి అనుష్టానం చేసుకుంటూ వుండగా ఆ కిరాతకుడు వచ్చి ఏకనాధుని ముఖంపై ఉమ్మి వేసాడు. సత్యం, ధర్మం, శాంతి, క్షమ లకు ప్రతిరూపమైన ఏకనాధుడు మారు మాట్లాడక తిరిగి స్నానం చేసి అనుష్టానం ప్రారంభించాడు. ఆ కిరాతకుడు వెంటనే వచ్చి మళ్ళీ ఏకనాధునిపై ఉమ్మి వేయగా ఏకనాధుడు తిరిగి స్నానం చేసాడు.
ఈ తంతు ఒకటి..రెండు..మూడు.. చివరకు నూట ఎనిమిది సార్లు జరిగింది. ఏకనాధునిపై కసిగా ఉమ్మి వేస్తున్న ఆ కిరాతకుడు అలిసి, సొలసి పోయాడు కాని ఏకనాధుడు మాత్రం అదే వినయ విధేయతలతో, శ్రద్ధతో, నిష్టగా గోదావరీ నదిలో స్నానం చేస్తునే వున్నాడు. ఆ మహనీయుని శ్రద్ధ, విశ్వాసం, సహనం, ఓర్పులకు ముదమొందిన ఆ కిరాతకుడు తక్షణం ఏకనాధుని పాదాలపై పడి భోరు భోరున విలపించాడు.
'స్వామీ! దయ చేసి నా యీ అపరాధాన్ని మన్నించు. అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం వలన ఆ నాస్తికులు ఇచ్చిన ధనానికి ఆశపడి ఇంతటి నీచమైన పనికి ఒడిగట్టాను. నిత్యం ధూమపానం, మద్య, మాంసాదులతో అపవిత్రం అయిన నా యీ నోటితో మీపై ఏకంగా నూట ఎనిమిది సార్లు ఉమ్మి ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను. నాకు రౌద్రవాది నరకముల ప్రాప్తి తప్పదు. దయచేసి నన్ను క్షమించి, ఆశీర్వదించండి. నాకు హిత బోధ చేసి నన్ను సన్మార్గం లో నడిపించండి' అని ఆ కిరాతకుడు అతి దీనంగా ప్రార్ధించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|