రాయుల ఉత్సవాలు
అనంతపురం : శ్రీ కృష్ణ దేవరాయుల 500 సంవత్సరాల పట్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ జే గీతారెడ్డి వెల్లడించారు. పురాతన కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె శ్రుక్రవారం మీడియాతో చెప్పారు. కృష్ణదేవరాయులు కట్టించిన ఆలయాలను కూడా పరిరక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెనుగొండలో అక్రమణలకు గురైన పురావస్తు శాఖ కట్టడాలను స్వాధీనం చేసుకుని పరిరక్షణకు చర్యలు చేపడతామని గీతారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు మంత్రికి చీర, గాజులు, పూలు అందచేసారు.
News Posted: 29 January, 2010
|