'విశ్వసనీయత ముఖ్యం'
కడప : రాజకీయాల్లో రాణించాలంటే ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరాలని కడప ఎంపీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కడప ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కాలజే అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. యువత కోసం దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ చేసిన కృషిని ఆయన కొనియాడారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఆరోగ్య శ్రీ వంటి పథకాల అమలుకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వై ఎస్ ఇచ్చిన మాటకే కట్టుబడ్డారని గుర్తు చేసారు.
News Posted: 2 March, 2010
|