కార్డుల పునరుద్ధరణ
కాకినాడ : కాకినాడ నగరంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో తాత్కాలిక వలసలుగా గుర్తించి వాటిలోని 9,945 కార్డ్ లకు రేషన్ పునరుద్ధరించారు.బోగస్ కార్డ్ లు ఏరివేతలో భాగంగా అధికారులు ఇటీవల కొన్ని కార్డ్ లకు రేషన్ నిలిపివేసారు. అయితే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సర్వే డాటాను పరిశీలించి రద్దైన కార్డ్ లకు రేషన్ సరఫరా చేయాల్సిందేనని కోరడంతో వాటిని మళ్లీ పునరుద్ధరిస్తున్నారు.
News Posted: 7 January, 2010
|