నెల్లూరు : ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లను మరో మూడు నెలలు పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వలును జారీ చేసింది. గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల సమయంలో ప్రభుత్వం 11 నియోజకవర్గాలకు ఒక డిప్యూటీ తహశీల్దార్ ను నియమించింది. అయితే ఇపుడు వీరికి తహశీల్దార్ పోస్టింగ్ లు ఇచ్చేందుకు ఎక్కడా ఖాళీలు లేనందున మరో మూడు నెలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.