రాజమండ్రి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అనూష తల్లితండ్రుల హత్య కేసులో నిందుతుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు మంజూరైంది. నగరానికి చెందిన అనూషను ప్రేమిస్తున్నాని వేధించి ఆమె తల్లితండ్రులను హత్య చేసాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానం తీర్పు మేరకు రిమాండ్ కు తరలించారు. అయితే జైలు జీవితం అనుభవిస్తున్న రాజేశ్ బుధవారం బెయిల్ పై విడుదలయ్యాడు. న్యాయస్థానం అతనికి మంగళవారం బెయిల్ జారీ చేయడంతో జైలు నుండి విముక్తి లభించింది.