ఐదుగురు మృతి
ఏలూరు : పశ్చమగోదావరి జిల్లా గోపాలపురం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News Posted: 13 January, 2010
|