రాజేష్ కు బెయిల్ పై పిటీషన్
రాజమండ్రి : నగరానికి చెందిన అనూష తల్లితండ్రుల హత్య కేసులో నిందుతుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు చేయడంపై కోర్టులో పిటీషన్ దాఖలైంది. సీఆర్పీసీ 167(2) కింద రాజేష్ బెయిల్ ను రద్దు చేయాలంటూ రాజమండ్రి పోలీసులు పిటీషన్ వేసారు. ఈ నెల 12 తేదీన నిందుతుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు కావడంపై బాధితురాలు అనూష, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు ఈ పీటీషన్ దాఖలు చేసారు.
News Posted: 19 January, 2010
|