అంతర్వేదిలో రథయాత్ర
ఏలూరు : అంతర్వేదిలో వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో ప్రధాన ఘట్టమైన స్వామి వారి రథయాత్ర వైభవంగా జరిగింది. మేళతాళాలతో ఆలయం నుంచి స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో తీసుకొచ్చి రథంపై అర్చక స్వాములు ఆశీనులు గావించారు. అనంతరం మొగల్తూరు రాజవంశీయుడైన రాజా కుమార సింహ జగపతి సత్యనారాయణ బహధూర్ రథానికి కొబ్బరికాయ కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం పురవీధుల్లో రధయాత్ర ఊరేగింపుగా సాగింది.
News Posted: 26 January, 2010
|