కరీంనగర్ : జిల్లాలోని రామగుండంలోని ప్లాంట్ లో విద్యుదుత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. ఇటీవల కాలంలో మూడు సార్లు వివిధ సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం కూడా రామగుండం యూనిట్ ట్రిప్ అయింది. సాంకేతిక లోపం కారణంగా ట్రిప్ అయింది. దీంతో మళ్లీ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.